Nonvegetarians:ఎప్పటికప్పుడు పెరుగుతున్న సాంకేతికత, అందుబాటులో ఉండే యంత్రల వల్ల చాలామంది కనీస వ్యాయామాలకు, శారీరక శ్రమ కూడా చేయకుండా ఉండీ పోతున్నారు. కదలకుండా యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ కూర్చుని పోతున్నారు. ఆఫీస్ లో కంప్యూటర్ ముందు గంటల కొద్దీ కూర్చోవడమే కాకుండా ఇంటికి వచ్చాక కూడా అదేపనిగా టీవీ చూడడం తో పాటు, సోషల్ మీడియాలో చాటింగ్తో అధిక సమయం కదదలకుండా ఒకే చోట కూర్చుండి పోతున్నారు.
దానికి తోడు ఆ సమయంలో చిరుతిళ్లు కూడా తినేస్తున్నారు. లేట్ గా పడుకుని లేట్ గా లేస్తుంటారు. ఆ తర్వాత మళ్ళీ ఉరుకులు పరుగులు తప్పవు . ఇక రోజువారీ జీవితంలో శారీరక శ్రమ చేయడానికి సమయమే ఉండటం లేదు? అది కుదరక పోవడం వలన మానసిక ఒత్తిడి, ఉద్వేగాలు ,ఆందోళన పెరిగిపోతున్నాయి. చెత్తాచెదారం తో కడుపు నింపుకుంటున్నారు. నూనె వేపుళ్లు, మసాలాలతో కూడిన ఆహార పదార్థాలు మాంసాహారం తిని అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నారు.
ముఖ్యంగా, వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. దీంతో అనేక మంది ముందు తమ ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే ముక్క లేనిదే ముద్ద దిగని వారెందరో ఇక తమ రూటు మార్చేస్తున్నారు. చికెన్, మటన్లను పక్కన పెట్టేసి ఎక్కువగా పండ్లు, ఆకు కూరలకు తమ రోజువారీ ఆహారంలో స్థానం కల్పిస్తున్నారు. ఇలా మారుతున్నవారు ఏకంగా 63 శాతం ఉండటం గమనించ వలసిన అవసరం ఉంది. ఇటీవల ఐప్సాస్ అనే సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం బయటపడింది .
గత యేడాది కొన్ని దేశాల్లో ఈ సర్వే చేసి దీనికి సంబంధించిన నివేదికను విడుదల చేశారు. ఒకప్పుడు తందూరీ చికెన్, మటన్ బిర్యానీ తెగ లాగించేసే వాళ్లు కూడా వాటిని తినడం మానేశారట. 63 శాతం మంది శాఖాహారమే మేలని నిర్ణయించుకుని ఆహారంలో మార్పులు చేసుకున్నారు అని సర్వే తెలియచేస్తోంది. అలాగే ఆర్గానిక్ ఫుడ్ తినడానికి 57 శాతం మంది ఇష్టపడుతున్నారు అని కూడా వివరించింది.