Kodali Nani: ఇటీవల వైయస్సార్ ఆసరా ఉత్సవ కార్యక్రమాలు కృష్ణాజిల్లా గొల్లపూడి లో జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి కొడాలి నానితో పాటు మరో మంత్రి పేర్ని నాని.. వసంత కృష్ణ ప్రసాద్ మరికొంతమంది వైసిపి ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చంద్రబాబు పై తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపించారు. 2014 ఎన్నికల సమయంలో డ్వాక్రా మహిళలకు హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక రుణాలను మొత్తంగా మాఫీ చేస్తాం అని సంతకం పెడతానని.. మాట ఇచ్చి మోసం చేశాడని.. చంద్రబాబు పగటి వేషగాడు గజ మోసగాడు అని డైలాగులు వేశారు. దేశంలో డ్వాక్రా మహిళలను మోసం చేసిన నాయకుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు.
డ్వాక్రా సంఘాలు తానే ప్రవేశపెట్టినట్లు డబ్బా కబుర్లు చెబుతారని.. ఎన్నికల సమయంలో రుణాలను మొత్తంగా మాఫీ చేసి.. ఇష్టానుసారం అయిన హామీలు ఇచ్చి వాటిని మాఫీ చేయకుండా రూపాయలు వడ్డీ మహిళలపై పడేలా.. చంద్రబాబు వ్యవహరించారని మండిపడ్డాడు. డ్వాక్రా మహిళా సంఘాల వద్ద రూపాయి ఒడ్డు వసూలు చేసిన గజ మోసగాడు.. చంద్రబాబు అని సీరియస్ కామెంట్లు చేశారు. కాకర సంఘాల పరిస్థితి ఇలా ఉంటే జగన్ అధికారంలోకి వచ్చాక.. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని రెండు దఫాల లో రద్దు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
మళ్లీ ప్రజలను మోసం చేయడానికి…
ఇదిలా ఉంటే వైయస్సార్ ఆసరా పథకం ద్వారా మహిళలకు.. ప్రభుత్వం సాయం చేస్తుంటే చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్న దుర్మార్గుడు అంటూ.. మండిపడ్డారు. జగన్ అధికారంలోకి రాగానే.. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని, గతంలో.. చంద్రబాబు సరిగ్గా ఎన్నికలకు ముందు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశారని ఇప్పుడు మరో రెండున్నర సంవత్సరాలలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మళ్లీ ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కొడాలి నాని సూచించారు. ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పేర్ని నాని కూడా మాట్లాడుతూ వైయస్సార్ ఆసరా పథకం కోసం.. ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎవరి రికమండేషన్ కూడా డోక్రా మహిళలకు వచ్చే డబ్బు విషయంలో అవసరం లేదని పేర్కొన్నారు.