ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అమరావతి విషయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. పేదలు ఉండడానికి వీల్లేని అమరావతిలో చట్టసభలు నిర్మించడం కూడా కుదరదని కొడాలి నాని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాలు పంచాలని నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. దీనిపై అమరావతి జెఏసి కోర్టు మెట్లెక్కింది.
మేము భూములు ఇచ్చినప్పుడు ఇక్కడ రాజధాని నిర్మిస్తామని చంద్రబాబు చెప్పి భూములు తీసుకున్నారు. ఇప్పుడు అక్కడ పేదలకు ఇళ్ళు నిర్మించడానికి వీల్లేదని జెఏసీ సభ్యులు వాదిస్తున్నారు. ఈ విషయంపై కొడాలి నాని మాట్లాడుతూ పేదలు ఉండడానికి పనికిరాని ఈ ప్రాంతంలో పేదల సమస్యలు తీర్చే చట్టసభలను మాత్రం ఎలా నిర్మిస్తారు. నేను వైఎస్ జగన్ ను కూడా కోరబోతున్నాను. హైకోర్టు కూడా పేదలు ఉండడానికి వీల్లేదని చెబితే కనుక అక్కడ రాజధాని నిర్మించడానికి కూడా వీల్లేదు అని అన్నారు.