తెలుగుదేశం పార్టీ నేతలను ఓ రేంజ్లో టార్గెట్ చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొడాలి నాని విషయంలో తెలుగుదేశం పార్టీ రూట్ మార్చింది.
ఇన్నాళ్లు వివిధ అంశాలపై స్పందించిన ఆ పార్టీ తాజాగా వ్యక్తిగత విమర్శలు మొదలుపెట్టింది. టీడీపీ అనుబంధ విభాగం నేతలతో తిట్టిపిస్తోంది. మంత్రి నాని మాట ఆయనింట్లో కుక్కకూడా వినదని సదరు నేత విరుచుకుపడ్డారు. సన్నబియ్యం సన్నాసి మంత్రి చెబితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ విన్నాడంటే ఎవరు నమ్ముతారు అంటూ ఆరోపించారు.
ఇంత ఘాటు కామెంట్లా?
టీఎన్ ఎస్ఎఫ్ రాష్ట్ర విభాగం మాజీ అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి నానిపై విమర్శలు గుప్పించారు. మంత్రి కొడాలి నాని అమరావతిలో శాసన రాజధాని వద్దని, విశాఖవెళ్లి ఆ నగరానికి వైసీపీ రంగులేసి, దాన్నే అభివృద్ధి చేశామని చెప్పుకుందామని చూస్తున్నారని ఆరోపించారు. అయితే నాని చెబితే ముఖ్యమంత్రి కాదు కదా… ఆయనింట్లోని కుక్కకూడా వినదనే నిజాన్ని బూతుల మంత్రి తెలుసుకోవాలని టీఎన్ఎస్ ఎఫ్ రాష్ట్ర విభాగం మాజీ అధ్యక్షుడు మండిపడ్డారు. కొడాలి నాని ప్రెస్ మీట్లకు వెళ్లే విలేకరులంతా తప్పనిసరిగా మాస్కుధరించి, కనీసం పది అడుగుల దూరంలో ఉంటే మంచిదని, లేకుంటే కరోనా కంటే పెద్ద వైరస్ బారిన పడటం ఖాయమని వ్యాఖ్యానించారు.
నాని ఇలా చెప్పుకొంటున్నారా?
అమరావతిలో శాసనరాజధాని వద్దని తాను ముఖ్యమంత్రికి చెప్పినట్లు మంత్రి కొడాలి నానీ చెప్పుకుంటున్నాడని తెలుగుదేవః పార్టీ ఆరోపించారు. వాస్తవానికి సన్నబియ్యం ఇస్తానని చెప్పి, ప్రజలను మోసగించారని ఆయన ఆరోపించారు. ఒక రాజధాని కట్టలేని వారు మూడు ఎలాకడతారంటూ ప్రజలు మనగురించి దారుణంగా మాట్లాడుకుంటున్నారని అందుకే విశాఖకు వెళదామని మంత్రి కొడాలి నాని చెప్పి ఉంటాడని ఎద్దేవా చేశారు. మంత్రి కొడాలి నాని లాంటివాళ్లు కేబినెట్లో ఉండి ప్రజలను అవమానిస్తున్నారని ఆరోపించారు.
వంశీ ఏమన్నారు?
వల్లభనేని వంశీ టీడీపీలో ఉన్నప్పుడు, జగన్ విషయంలో ఘాటు వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేత మండిపడ్డారు. నియోజకవర్గాల గురించి పట్టించుకోకుండా, ప్రశ్నించే వారిపై కేసులు పెడుతూ, రౌడీషీటర్లతో వారి ఇళ్లకు వెళ్లి బెదిరిస్తూ నాని, వంశీలు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల తరుపున ప్రశ్నించే తన లాంటి వాళ్లు, నాని బెదిరింపులకు భయపడరని, అవసరమైతే హైకోర్టుకు వెళ్లైనా సరే కొడాలి ఆటకట్టిస్తారనని తెలిపారు.