మంత్రి కొడాలి నాని ఇటీవల ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అదేవిధంగా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. స్క్రిప్టు రాసి ఇస్తే చదివే వాడు పవన్ కళ్యాణ్ అంటూ సెటైర్లు వేశారు. గుడివాడ నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల్లో భారీ స్థాయిలో అభివృద్ధి జరిగిందని 22 కోట్లు పెట్టి కొత్త బస్టాండ్ అదేవిధంగా 10 కోట్లకు పైగా ఖర్చుపెట్టి హాస్పిటల్ కడుతున్నాం అని కొడాలి నాని పేర్కొన్నారు.
చంద్రబాబు కి భజన చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఎద్దేవా చేశారు. కానీ రాష్ట్ర ప్రజలు జగన్ ని నమ్మి ముఖ్యమంత్రి చేయడం జరిగిందని..ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఎలాంటి సమస్య ఉన్నా సీఎం జగన్ కి తెలియజేస్తే వెంటనే స్పందిస్తున్నారని భారీ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం దేనికి సంకేతం అంటూ కొడాలి నాని మండిపడ్డారు. ఈ క్రమంలో మీరు భయపడరు అని స్టేట్మెంట్ ఇస్తున్నారా అంటూ యాంకర్ వేసిన ప్రశ్న కి కొడాలి నాని తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. నాకు చాలా భయలు ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు అంటే భయం అదేవిధంగా గౌరవం, నియోజకవర్గ ప్రజలు అంటే భయం అదేవిధంగా గౌరవమని పేర్కొన్నారు. ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే భయంతో ఉంటాను అంటూ కొడాలి నాని స్పష్టం చేశారు.