పానీ పూరీ.. ఈ పేరు వినగానే నోట్లో నీళ్లు ఊరుతున్నాయా..? అంతే కదా మరీ.. ఆ పూరీలను వేడివేడి పప్పులో కొద్దిగా ముంచి దాన్ని పూరీ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఆ టేస్టీ వాటర్ ముంచి ఇస్తుంటే.. అందులో కొద్దిగా ఉల్లిపాయలను వేసుకుని నోట్లో పెట్టుకుంటే ఎట్లుంటది..? అబ్బా ఆ టేస్టును మాటల్లో సెప్పలేము కదా..? అవును సంటి పాప నుంచి పండు ముసలి వరకు లొట్టలేసుకుని తినే ఈ పానీ పూరీకి చాలా చరిత్రే ఉంది.
దాదాపుగా అందరి హృదయాలను అమాంతం హద్దుకునే ఈ పానీ పూరీలను తయారీని చూశారంటే మాత్రం మీకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావడం పక్కా.. అవును జనాల ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఎంతో జాగ్రతగా చేయాల్సింది పోయి.. కొందరూ విచ్చల విడిగా మనుషులు తినకూడనివి, తినలేని వాటిని కలుపుతూ.. టేస్టీ టేస్టీ పానీ పూరీ అంటూ మనకు అమ్ముతున్నారు. మనం టేస్టును చూస్తున్నామే కానీ ఎలా తయారు చేస్తున్నారు అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో వాళ్లు ఆడిందే ఆట పాడిందే పాటగా మారుతోంది.
ఒక దగ్గర ఇలాంటి విషయమే విలుగులోనికి వచ్చింది. పానీ పూరీలను అమ్మే ఓ వ్యాపారి తాగకూడని, తాగలేని నీటిని కలుపుతూ వ్యాపారం చేస్తున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానికులు ఆ దుకాణాన్ని ధ్వంసం చేశారు. అలాగే దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీన్ని చూసిన చాలా మంది ఇంత నీచంగా తయారు చేస్తారా అంటూ మండి పడుతున్నారు. ఈ ఘటన ముంబాయిలో చోటు చేసుకుంది.
ఇంతకీ అతను ఏ వాటర్ వాడుతున్నాడో చెప్పలేదు కదా..? టాయిలేట్ దగ్గర వచ్చే ట్యాబ్ వాటర్ తో పానీ పూరీలోకి కావలసిన వాటర్ ను తయారు చేస్తున్నాడు. దీంతో స్థానికులకు ఆగ్రహం కట్టలు తెంచుకు వచ్చింది. కరోనా వల్ల ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రతలను తీసుకుంటున్న జనం.. ఇలాంటి విషయాలను చూసి బయటి ఫుడ్ ను అసలు తినొద్దని అనుకుంటున్నారు. డాక్టర్లు కూడా ఇలాంటి విషయాన్ని పదే పదే చేప్తున్నారు. బయటి ఫుడ్ ను ఎంత తగ్గిస్తే అంత మంచిదని చెబుతున్నారు.
పానీ పూరీలో వాడే వాటర్ ప్రతిరోజూ ఫ్రెష్గా తయారు చేయాల్సి ఉంటుంది. మరుసటి రోజుకు ఆ నీటిలో వైరస్ చేరే ప్రమాదం లేకపోలేదు. రెగ్యులర్గా నీటిని మార్చకుండా పానీపూరీలను వ్యాపారులు అమ్మితే.. వాటిని తిన్నవారు ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ఆరుబయట ఏమైనా తినాల్సి వస్తే.. తప్పని పరిస్థితిలో మాత్రమే తినాలని డాక్టర్లు చెబుతున్నారు. అది కూడా మంచిదని తెలుసుకున్న తర్వాతే అని అంటున్నారు.
అయితే ఇలాంటి ఘటనలు ఇప్పుడేం కొత్త కాదు. గతంలో రైల్వే స్టేషన్ లో టీ తయారు చేసే వ్యాపారీ కూడా ఇలా చేస్తూ దొరికిపోయాడు. ఈ టీ తయారీకి రైలు బోగిలోని టాయిలెట్ వాటర్ ను వాడేవాడు.దీన్ని సదరు ప్రయాణికుడు వీడియో తియడంతో ఈ విషయం వెలుగులోనికి వచ్చింది. ఇది కూడా ఎక్కడో కాదు సికింద్రాబాద్ రైల్వే స్టేషలోనే.. ఇలాంటి ఘటనలు మహా నగారాల్లోనే అవుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.