మచిలీపట్నం వైసీపీ నేత పేర్ని నాని ప్రధాన అనుచరుడు అయిన మోకా భాస్కరరావు హత్యకేసులో టిడిపి నేత కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే రవీంద్ర నిరపరాధి అని…. ప్రాధమిక విచారణలో లేకుండా అతనిని అరెస్టు చేశారు అని చంద్రబాబు, అతని పార్టీ వారు గగ్గోలు పెడుతుండగా వారికి షాక్ ఇస్తూ కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ ఈ కేసుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రెస్ ముందు వెల్లడించారు.
భాస్కర రావు ను హత్య చేసిన ఈ కేసులో ప్రధాన నిందితుడైన నాంచారయ్య హత్యకు నాలుగు రోజులు ముందు కొల్లు రవీంద్ర ను ఒక హోటల్ లో కలిసి సమావేశమయ్యారని ఎస్పీ వారు చర్చించిన రూమ్ నెంబర్ తో సహా చెప్పేశారు. అంతే కాకుండా 2013 లో ఒకసారి ల్కూడా మోకా భాస్కరరావు పై హయాయత్నం జరిగిందని అన్నారు.
ఇలా భాస్కరరావు హత్యతో రాజకీయంగా తాము బలపడే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పడంతో కొల్లు రవీంద్ర తన పేరు బయటకు రాకుండా పని ముగించాలంటే చెప్పినట్లు ఎస్పీ అన్నారు. నిందితున్ని పట్టుకొని అతని దగ్గర వాంగ్మూలం తీసుకున్నామని ఎస్పీ చెప్పడం గమనార్హం.
ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరి మధ్య ఎంతో కాలంగా రాజకీయంగా మరియు సామాజిక వర్గం పరంగా గొడవలు ఉన్నాయని…. ఇక నిందితుల వాగ్మూలం తీసుకున్న తర్వాతనే కొల్లు రవీంద్ర అరెస్టు చేశామని ఆయన చెప్పడం గమనార్హం. 2వ తేదీన ముగ్గురు నిందితులను పట్టుకున్నామని మూడో తేదీన రవీంద్ర ను అరెస్టు చేశామని ఎస్పీ చెప్పారు. కొద్ది సేపట్లో కొల్లు రవీంద్ర ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయస్థానం ముందు ప్రవేశ పెట్టనున్నారు. ఇక ఈ కేసు నుండి కొల్లు తప్పించుకోవడం కష్టమనే అభిప్రాయం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఏర్పడుతుంది.