Lokesh kanagaraj : రాం చరణ్ పక్కాగా పాన్ ఇండియన్ సినిమాలను చేసేందుకే ప్రణాళికలను వేసుకుంటున్నాడు. ఫిక్షన్ కథతో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరంలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న చరణ్ ఈ ప్రాజెక్ట్ పూర్తి కాగానే తమిళ క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నట్టు ప్రకటిన వచ్చింది. మెగాస్టార్ కూడా చేయని శంకర్ తో చరణ్ సినిమా చేయనున్నట్టు వచ్చిన ఈ ప్రకటన ఒకరకంగా చాలా మందికి షాకింగ్ న్యూస్ లా అయింది. అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా సెట్ అయిందో అని అందరూ ఆసక్తికరంగా మాట్లాడుకున్నారు.
ఎట్టకేలకి దిల్ రాజు సెట్ చేయడం టాలీవుడ్ లో మాత్రమే కాదు కోలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ అయిపోయింది. కామెంట్స్ కూడా చాలా వచ్చాయి. దిల్ రాజు శంకర్ రేంజ్ లో సినిమాకి బడ్జెట్ ఎలా పెడతాడో..ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేదేనా ..ఇలా రక రకాలా మాటలు వినిపించాయి. వీటన్నిటిని పట్టించుకోకుండా శంకర్ బృందం సైలెంట్గా ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ చేసుకుంటూ వెళుతున్నారు. ఇంతలో శంకర్ ఇప్పటికే మొదలు పెట్టిన ఇండియన్ 2 వ్యవహారం తేలకపోవడం..ఇదే సమయంలో అపరిచితుడు హిందీ రీమేక్ ప్రకటన రావడంతో కాస్త శంకర్ – చరణ్ ప్రాజెక్ట్ మీద సందేహాలు మొదలయ్యాయి.
Lokesh kanagaraj : శంకర్ – రాం చరణ్ – దిల్ రాజు ప్రాజెక్ట్ ఉంటుందా.
ఇదిలా ఉంటే కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగ్రాజ్ తో మైత్రీ మూవీ మేకర్స్ ఓ ప్రాజెక్ట్ అనుకుంటున్నారని ఇందులో చరణ్ ని హీరోగా నటింప చేయాలనుకుంటున్నారని ఇప్పుడు లేటెస్ట్ టాక్. అన్ని అనుకున్నట్టు జరిగితే శంకర్ కంటే లోకేష్ కనగ్రాజ్ చరణ్ తో ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకి తీసుకు రానున్నట్టు సమాచారం. ఆచార్య, అలాగే ఆర్ఆర్ఆర్ పూర్తి అవగానే ఈ ప్రాజెక్ట్ మొదలవనుందని తెలుస్తోంది. చూడాలి మరి సడన్ గా లైన్ లోకి వచ్చిన లోకేష్ తో చరణ్ ప్రాజెక్ట్ ఉంటుందా లేక ఆల్రెడీ అనౌన్స్ అయిన శంకర్ – దిల్ రాజు ప్రాజెక్ట్ ఉంటుందా.