Koo app : ప్రపంచం లోని ఇతర దేశాల మీద ఆధారపడకుండా మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు ప్రోత్సహిస్తున్నప్పటి నుంచి స్వదేశీ యాప్ లకు కొదవే లేదు.. చైనా యాప్ లను నిషేదించినప్పటి నుంచి వాటి ప్రత్యామ్నాయ యాప్ లలో ” కూ ” యాప్ ఒకటి.. Koo యాప్ కి భారతీయుల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని సంస్థ సీఈఓ అప్రమేయ రాధాకృష్ణ తెలిపారు.. Koo app విశేషాలను పంచుకునేందుకు ఆన్లైన్ పత్రికా సమావేశంలో రాధాకృష్ణ పేర్కొన్నారు..
” కూ ” యాప్ ఇది మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ తరహాలో ఉంటుంది.. ప్రస్తుతం తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, గుజరాతి, కన్నడ, బెంగాలీ భాషలలో ఈ యాప్ అందుబాటులో ఉందని వివరించారు. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే ప్రపంచపు అతిపెద్ద తెలుగు మైక్రో బ్లాగింగ్ గా నిలిచిందన్నారు.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు , అధికారులు ఈ Koo app ని వినియోగిస్తున్నారని చెప్పుకొచ్చారు.
Koo app అనేది వ్యక్తిగత అప్డేట్స్, అభిప్రాయాలను పంచుకునే మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ . ఇందులో ఆసక్తికరమైన విషయాల పై ప్రజలు చర్చిస్తారు. స్థానిక భారతీయ సమాజం తో భారతీయ భాషలలో తన ఆలోచనల్లో వ్యక్తీకరించడానికి ఇది ప్రజలను ప్రోత్సహిస్తుంది. కూ యాప్ ను ఆత్మనిర్బర్ యాప్ గా ప్రకటించారు. ఆగస్టు 2020 లో భారత ప్రభుత్వం నిర్వహించిన ఆత్మ నిర్బర్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ను గెలుచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగంలో కూ యాప్ ను ఉపయోగించి భారతీయులను ప్రోత్సహించారు.