టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొరటాల శివ కి మంచి క్రేజ్ ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎన్.టి.ఆర్, రెబల్ స్టార్ ప్రభాస్ లతో తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళని రాబట్టి సూపర్ హిట్స్ ని ఇచ్చాడు కొరటాల. దర్శకుడిగా మంచి ఫాం లో ఉన్న కొరటాల నిర్మాతగా మారబోతున్న సంగతి తెలిసిందే. తన అసోసియోట్ కిరణ్ ని దర్శకుడిగా పరిచయం చేయబోతున్నాడు. అంతే కాదు ఆహా కోసం కొరటాలనే స్వయంగా స్క్రిప్ట్ రాసి వెబ్ సిరీస్ ను నిర్మించబోతున్నాడు.
టినేజ్ లో యూత్ లవ్ లో పడటం వల్ల వాళ్ళ లైఫ్ ఎలా డిస్టర్బ్ అవుతుందనే పాయింట్ మీద వెబ్ సిరీస్ ని తయారు చేయబోతున్నారట. ఇక ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా ఆచార్య సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్ లో రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. రాష్ట్రంలోని దేవాలయాలతో పాటు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన ఎండోమెంట్స్ విభాగానికి చెందిన గవర్నమెంట్ ఆఫీసర్ గా మెగాస్టార్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు.
కరోనా కారణంగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యో సూచనలు కనిపించడం లేదని అంటున్నారు. వాస్తవంగా అయితే అక్టోబర్ నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో ఇరవై ఐదు రోజులు సినిమాలోని కొన్ని కీలకమైన సీన్స్ ను షూట్ చేయాలని షెడ్యూల్ ప్లాన్ చేసినప్పటికి చిత్రీకరణ జరపడం కాస్త కష్టమనే చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తోను ఒక సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి కారణజన్ముడు అన్న టైటిల్ ని కూడా అనుకుంటున్నారట. మొత్తానికి కొరటాల సినిమాలలోనే కాదు వెబ్ సిరీస్ లలోను సామాజిక అంశాన్ని వదలడం లేదు.