Chiranjeevi: దేశంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీకి అన్నీ తానై వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వాలు సినిమా షూటింగులు ఆపేయాలని ప్రకటించక ముందే.. చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆచార్య సినిమా షూటింగ్ ఆపేశారు. సినీ కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత లాక్ డౌన్ దెబ్బకి షూటింగులు ఆగిపోవడం తెలిసిందే. ఆ సమయంలో సినీ కార్మికులకి నిత్యావసరాల సరుకులు ఇంకా అనేక సహాయ కార్యక్రమాలు మెగాస్టార్ చిరంజీవి బాధ్యత తీసుకుని ఇతర హీరోల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి మరి అనేక సేవా కార్యక్రమాలు చేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలాఉంటే ఇటీవల మే ఫస్ట్ కార్మికుల దినోత్సవం నాడు సినిమా కార్మికుల సంక్షేమం కోసం చిరంజీవి పలు హామీలు ప్రకటించడం తెలిసిందే. దానిలో ఒకటి ఇ సినిమా కార్మికుల కోసం ఒక పెద్ద హాస్పిటల్ నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిరంజీవి ఈ ప్రకటన చేయడం జరిగింది. మెసేజ్ సినీ కార్మికులకు హాస్పిటల్ అని చిరంజీవి హామీ ఇవ్వడం పట్ల సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు వైరల్ కామెంట్ చేశారు.
ఇటువంటి హామీలు ప్రచారానికి ఉపయోగపడతాయి తప్ప కార్మికులకు.. ఏ మాత్రం మంచిది చేసినట్లు అవ్వదన్నట్టు చెప్పుకొచ్చారు. అంతమాత్రమే కాదు చిరంజీవి అనవసరమైన హామీలు ఇవ్వకుండా మానుకోవాలని పేర్కొన్నారు. ఎటువంటి హామీలు ఇచ్చే బదులు సినీ కార్మికులకు మంచి పని కల్పించాలని ఉపాధి చూపించాలని సూచించారు. సినీ కార్మికులు రోజుకు మూడు పూటలా తిండి కోసం అల్లాడుతుంటే చిరంజీవి హాస్పిటల్ పెడతానని చెబుతున్నారు. అసలు ఇటువంటి పరిస్థితుల్లో ఎవరికైనా ఉపాధి కావాలి. ఆ దిశగా దారి చూపించాలి. ఇటువంటి సమయంలో హాస్పిటల్ అవసరమా…? అదే పని కల్పిస్తే డబ్బు సంపాదించుకుని అవసరమైతే ప్రైవేట్ ఆసుపత్రులు ఆయన చూపించుకో గలరు. ఎటువంటి నిర్ణయమైన సినీ కార్మికుల సంపూర్ణ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి అంటూ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కోటా శ్రీనివాస రావు వైరల్ కామెంట్లు చేశారు.