రవితేజ హీరోగా నటించిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ క్రాక్ ఈ రోజు విడుదలకు సిద్ధమైన దశలో మాస్ మహారాజా ప్రేక్షకులకు, సినీ అభిమానులకు భారీ షాక్ తగిలింది. ఒక్కసారిగా హైదరాబాద్ నగరంతో సహా 2 తెలుగు రాష్ట్రాల్లో ని చాలా సెంటర్లలో మార్నింగ్ షో క్యాన్సిల్ చేశారు.
చాలా రోజుల తర్వాత థియేటర్లలో ఒక పక్కా మాస్ ఎంటర్టైనర్ సినిమా చూద్దాం అని టికెట్ బుక్ చేసుకున్న వారందరికీ ఇది చాలా నిరాశ కలిగించే వార్త. కొన్నిచోట్ల అయితే మధ్యాహ్నం షో, స్పెషల్ షో లు కూడా రద్దు చేశారు. ఇక విషయం ఏమిటంటే…. సినిమా ప్రొడ్యూసర్ బిం మధు కొంతమంది తమిళ ప్రొడక్షన్ వారికి ఇవ్వవలసిన మొత్తం సమయానికి ఇవ్వలేదని విషయం కోర్టు వరకు వెళ్ళింది.
దీంతో వెంటనే ఉన్నఫలంగా ఈ సినిమా స్క్రీనింగ్ ఆపి వేయవలసిందిగా ఉత్తర్వులు వచ్చాయి. మొత్తానికి ఈ సమస్య ఎంత సేపటికీ తీరుతుంది అనే దానిపై స్పష్టత లేదు. ప్రస్తుతం టికెట్ బుక్ చేసుకునే వారికి రిఫండ్ సౌకర్యం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. తర్వాతి షో ఎప్పుడు అన్న విషయం పైన కూడా ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఎంతైనా రవి తేజ సినిమాకు ఇలా జరగడం నిజంగా దురదృష్టకరం అని చెప్పాలి.