Krish – 4 : బాలీవుడ్ లో క్రేజీ ఫ్రాంఛైజీ అంటే క్రిష్ ఫ్రాంఛైజీ. బాలీవుడ్ లో స్టార్ హీరోగా అసాధారణమైన క్రేజ్ అండ్ పాపులారిటీని సంపాదించుకున్న హృతిక్ రోషన్ ఈ సినిమాలో నటిస్తూ వస్తున్నాడు. సొంత బ్యానర్ లో నిర్మిస్తున్న సినిమా కాబట్టి బడ్జెట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా తీస్తున్నారు. బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ సిరీస్ సినిమాలంటే ధూమ్..క్రిష్ సిరీస్ మాత్రమే. ఒకవైపు ధూమ్ మేకర్స్ ఈ సిరీస్ లో 4వ భాగానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ప్రభాస్ గానీ, అక్షయ్ కుమార్ గానీ విలన్ గా నటించడానికి ప్రయత్నాలు చేస్తున్నారట.
దాంతో క్రిష్ ఫ్రాంఛైజీలోని 4 వ భాగం అయిన క్రిష్ 4 కి ప్లానింగ్ మొదలయ్యాయట. వాస్తవంగా గత రెండేళ్ళ నుంచి క్రిష్ 4 తెరకెక్కించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ కరోనా కారణంగా అన్నీ ప్లాన్స్ కి బ్రేక్ పడింది. హృతిక్ రోషన్ నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్ళు దాటింది. సూపర్ 30 తర్వాత ఈ హీరో నుంచి మళ్ళీ సినిమా రాలేదు. రెండు మూడు భారీ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసినప్పటికి పరిస్థితులు అనుకూలించక అన్నీ హోల్డ్ లోనే పడిపోయాయి. అయితే ఇప్పుడు క్రిష్ 4 సెట్స్ మీదకి తీసుకు వచ్చే ప్లాన్ హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ రెడీ అవుతున్నారట.
Krish – 4 : క్రిష్ ఎలా తిప్పి కొట్టాడు అన్నదే థీం.
కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రిష్ మొదటి పార్ట్ లో జాదూ క్యారెక్టర్ చాలా హైలెట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత మళ్లీ వచ్చిన భాగాలలో జాదూ ను చూసిందే లేదు. తాజాగా సమాచారం ప్రకారం 4వ పార్ట్ లో జాదూ క్యారెక్టర్ ను చూపించబోతున్నారట. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కథ గురించి బాలీవుడ్ ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయట. సినిమాలో హీరో తయారు చేసిన ఒక మెషన్ తో భవిష్యత్తు కాలానికి వెళ్లడంతో పాటు గడచిపోయిన కాలం లోకి కూడా వెళ్ళే విధంగా కథ సాగుతుందట.ఈ టైం మిషన్ ను దక్కించుకునేందుకు విలన్స్ ని క్రిష్ ఎలా తిప్పి కొట్టాడు అన్నదే థీం అని తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన మరికొన్ని విషయాలు అధికారకంగా వెల్లడికానున్నాయట.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!