Krish : క్రిష్ .. పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఒక పీరియాడికల్ సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో 27 వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్, బాలీవుడ్ బ్యూటి జాక్విలిన్ ఫెర్నాండస్ హీరోయిన్ గా నటిస్తున్నారని సమాచారం.
ఇక ఈ సినిమాకి పలు టైటిల్స్ ప్రచారం లో ఉన్నాయి. పీరియాడికల్ సినిమా కాబట్టి ముందు నుంచి విరూపాక్ష అన్న టైటిల్ రిజిస్టర్ చేయించారని వార్తలు వచ్చాయి.
అయితే ఈ మధ్య విపరీతంగా రక రకాల టైటిల్ ని మేకర్స్ అనుకుంటున్నారని సోషల్ మీడియాలో న్యూస్ విపరీతంగా స్ప్రెడ్ అవుతున్నాయి. హర హర మహదేవ్.. హర హర వీరమల్లు అన్న టైటిల్స్ తాజాగా ప్రచారంలో నిలిచాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకి భారీ చార్మినార్ సెట్ నిర్మిస్తున్నట్టు లేటెస్ట్ న్యూస్ ఒకటి ఫిల్మ్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. డైరెక్టర్ క్రిష్ 17వ శతాబ్దంలోని కథ ని తెర మీదకి తీసుకు వస్తున్నాడని ముందు నుంచి చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని భారీ సెట్స్ ని నిర్మించనున్నారట. లాక్ డౌన్ కి ముందే హైదరాబాద్ అల్యూమియం ఫ్యాక్టరీలో ఒక సెట్ వేసి 15 రోజులు షూటింగ్ జరిపాక ఆ సెట్ కూలిపోయింది.
Krish : 17వ శతాబ్దం కాలం చార్మినార్ సెట్..?
కాగా ఇప్పుడు ఈ సినిమాకోసం కొత్తగా నిర్మిస్తున్న సెట్స్ లో చార్మినార్ సెట్ కూడా ఉందట. అయితే ఆ సెట్ 17వ శతాబ్దం కాలంలో ఎలా ఉందో అలా నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమాకి చార్మినార్ సెట్ ప్రత్యేకంగా నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక క్రిష్ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి పిరియాడికల్ డ్రామాను తెరకెక్కించి ఇండస్ట్రీలో ఉన్న పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు.
ఇక పవన్ కళ్యాణ్ తో ప్రస్తుతం తెరకెక్కించనున్న సినిమాతో ఎలాంటి సక్సస్ అందుకుంటాడో.. పవన్ కళ్యాణ్ కి ఏ రేంజ్ హిట్ ఇస్తాడో అని అందరు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమా ఈ ఏడాదిలోనే రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?