దాదాపు రెండు సంవత్సరాలపాటు రాజకీయాలలో బిజీబిజీగా గడిపిన పవన్ కళ్యాణ్ తిరిగి ఈ ఏడాది ప్రారంభంలో “వకీల్ సాబ్” అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు సంవత్సరాలపాటు పవన్ కళ్యాణ్ బొమ్మ వెండితెరపై కనపడక పోవటంతో ఫాన్స్ చాలా నిరుత్సాహం చెందారు. ఇటువంటి తరుణంలో అభిమానుల ఆకలి తీర్చడానికి పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత జెట్ స్పీడులో సినిమాలను ఒప్పుకుంటున్నారు. ప్రస్తుతం చేస్తున్న వేణు శ్రీరామ్ దర్శకత్వంలో “వకీళ్ సాబ్” క్రిష్, హరీష్ శంకర్ వంటి డైరెక్టర్లతో సినిమాలను ఒప్పుకుని ప్రకటించిన లైన్ లో పెట్టారు. అయితే పవన్ ఓకే చేసిన ఈ సినిమాలన్నిటిలో స్పెషాలిటీ ఉన్న సినిమా డైరెక్టర్ క్రిష్ తో చేస్తున్న సినిమా.
కారణం చూస్తే పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే చారిత్రాత్మక నేపథ్యం కలిగిన సినిమా. ఇటీవల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు సినిమాకి సంబంధించి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాని పవన్ కళ్యాణ్ తో “ఖుషి” లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా నిర్మించిన ఏ ఎన్ రత్నం నిర్మిస్తున్నారు. సినిమాకి సంబంధించి హైదరాబాద్ లో భారీ సెట్ కూడా వేయడం జరిగింది. దాదాపు పదిహేను రోజుల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు పవన్ కాస్త బ్రేక్ ఇవ్వటంతో… డైరెక్టర్ క్రిష్ ఆలోగా మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమా చేయాలని రెడీ అయ్యారు.
దీంతో పవన్ క్రిష్ సినిమా షూటింగ్ ఇప్పుడు అప్పుడే మొదలయ్యే ప్రసక్తిలేదని ఇండస్ట్రీలో టాక్ నడిచింది. దీంతో ఫుల్ నిరుత్సాహానికి గురయ్యారు పవన్ ఫ్యాన్స్. పరిస్థితి ఇలా ఉండగా ఏమైందో ఏమో తెలియదు గానీ మెగా మేనల్లుడి ప్రాజెక్ట్ పక్కనపెట్టి పవన్ తో చేయాల్సిన సినిమాని క్రిష్ పూర్తి చేయనున్నారట. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబందించిన రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ మాసం నుండి స్టార్ట్ కాబోతున్నట్లు త్వరలోనే క్రిష్… అనగా దసరాకి సినిమాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ చెప్పబోతున్నట్లు ఫిలింనగర్ టాక్.