ఏపీ రాజకీయాలలో కృష్ణా జిల్లా టీడీపీకి కంచుకోట లాంటి జిల్లా అని చాలామంది చెబుతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా విభజన జరిగిన తర్వాత గానీ చాలా వరకు టిడిపి ఎటువంటి ఎన్నికలు వచ్చినా భారీ స్థాయిలో స్థానాలు ఈ జిల్లాలో గెలుచుకుంటది. అంతమాత్రమే కాకుండా టిడిపికి వెన్ను దన్నుగా ఉండే సామాజిక వర్గాలు చాలావరకూ ఈ ప్రాంతంలోనే ఉండటం వల్లే చంద్రబాబు.. అమరావతిని రాజధాని గా గుర్తించడం జరిగిందని కూడా చెబుతుంటారు.
అటువంటి కృష్ణా జిల్లాలో టిడిపి సీనియర్ లకు సొంత పార్టీలో ఉన్న ఒక నాయకుడు టెన్షన్ పుట్టిస్తున్నట్లు ఏపీ రాజకీయవర్గాలలో సరికొత్తగా వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే దివంగత వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా కృష్ణా జిల్లా టిడిపి సీనియర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నట్లు టాక్ వస్తోంది. వంగవీటి రంగా తనయుడిగా పాలిటిక్స్ లో అడుగుపెట్టిన రాధా మూడు సార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది.
2019 ఎన్నికల్లో పోటీ చేయకుండా టిడిపిలో ఉన్న వంగవీటి రాధా.. టిడిపి ఓడిపోయిన తర్వాత పార్టీ మారుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అలాంటి పరిస్థితిలు యామి వాస్తవం లో కనబడలేదు. పైగా చంద్రబాబు రాధా కి ప్రాధాన్యత ఇస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో.. రాధా కి దగ్గరగా ఉండే వ్యక్తులకు టికెట్లు కేటాయించడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అమరావతి ఉద్యమం విషయంలో కీలకంగా రాణిస్తున్న టిడిపి…అమరావతి పై సామాజిక వర్గం ముద్రవేసిన ప్రత్యర్థుల ఎత్తుగడలను తుడిచి వేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందువల్లే అమరావతి ఉద్యమానికి సంబంధించి కీలక కార్యక్రమాల్లో వంగవీటి రాధా నీ ముందుండి నడిపించే రీతిలో చంద్రబాబు స్కెచ్ వేసినట్లు, ఈ దెబ్బతో అమరావతి రాజధాని పై అధికార పార్టీ వేస్తున్న కుల ముద్ర తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వస్తోంది. ఇదే తరుణంలో రాధా కూడా కుల ప్రస్తావన తీసుకు వస్తూ చేస్తున్న ప్రసంగాలు టిడిపి పార్టీకి పొలిటికల్ మైలేజ్ తీసుకొచ్చే విధంగా ఉన్నట్లు ఇప్పటికే ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట. దీంతో కృష్ణా జిల్లా టిడిపి పార్టీలో ఎప్పటినుండో ఉన్న సీనియర్లకు.. చంద్రబాబు వంగవీటి రాధా కి ఇస్తున్న ప్రాధాన్యత చూసి టెన్షన్ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.