సీనియర్ యంగ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు 80 పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు తెలియజేశారు. ఈ క్రమంలో రాధేశ్యామ్ సినిమా తన బ్యానర్లో తెరకెక్కుతున్న నేపద్యంలో ప్రభాస్ అభిమానులు.. సినిమాకి సంబంధించిన విషయాల గురించి ఫోన్ ద్వారా అడిగి తెలుసుకున్నారు.
ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని కొంతమంది ప్రశ్నించగా దానికి సమాధానం ఇస్తూ వేసవికి ఏప్రిల్ మాసంలో రిలీజ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక ఇదే రీతిలో ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అని చాలామంది ప్రశ్నించగా అది తన చేతుల్లో లేదని.. జరగవలసిన టైంలో జరుగుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఫస్ట్ టైం పూజా హెగ్డే తో ప్రభాస్ ఈ సినిమా చేస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి.
ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా తరహాలో రిలీజ్ కానుంది. “సాహో” తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుండో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. జిల్ ఫేమ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని కృష్ణంరాజు తో పాటు యు.వి.క్రియేషన్స్ నిర్మాణ సంస్థ వారు సంయుక్తంగా కలిసి నిర్మించడం జరిగింది.