అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 1.56.997 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 1.60.333 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్ 1.32.215 క్యూసెక్కుల ఇన్ఫ్లో కాగా అవుట్ ఫ్లో 1.32.215 క్యూసెక్కులుగా ఉంది. పులిచింతల ప్రాజెక్టు ఇన్ఫ్లో 1.33.702 క్యూసెక్కులు..అపుట్ ఫ్లో 1.46.840 క్యూసెక్కులుగా ఉంది.
విజయవాడ ప్రకాశం బ్యారేజీకి ఇన్ఫ్లో 1.62.029 క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 1.34.675 క్యూసెక్కులుగా ఉంది. పులిచింతల నుండి వచ్చే వరద నీటికి తోడు మున్నేరు, కట్లేరు, వైరాయేరుల వరద నీరు తోడు కావడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. దీంతో అధికారులు లక్షా 35వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.