అమరావతి: ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణానదికి మళ్లీ వరద నీరు చేరుతున్నది. ఎగువ నుండి ప్రకాశం బ్యారేజికి 30వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో బ్యారేజ్ పది గేట్లను ఎత్తి 7,500 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణానదికి వరద పెరిగే అవకాశం ఉండటంతో దిగువ ప్రాంతంలో అధికారులను అప్రమత్తం చేశామని కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు.
previous post
next post