(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణానదికి వరద ప్రభావం క్రమంగా తగ్గుతున్నది. శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో 4,42,567 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 2,46,577 క్యూసెక్కులుగా నమోదైంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 882.7 అడుగులుగా ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టిఎంసిలకు గానూ ప్రస్తుతం 202.96 టిఎంసిల నీరు ఉంది.
నాగార్జునసాగర్కు వరద ప్రవాహం భారీగా తగ్గింది. జలశయానికి ఇన్ఫ్లో 2,57,535 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 2,57,525 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 586.70 అడుగులు నమోదైంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312 టిఎంసిలు కాగా ప్రస్తుతం 303.94 టిఎంసిల నీరు ఉంది.
పులిచింతల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 4,80,174 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 5,08,071 క్యూసెక్కులుగా ఉంది. ప్రకాశం బ్యారేజికి ఇన్ఫ్లో 6,00,103 క్యూసెక్కులు కాగా అంతే మొత్తం దిగువకు విడుదల చేస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?