ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి దయనీయంగా ఉందన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలలో దాదాపు కోలుకోలేని విధంగా ఏపీ ప్రజలు తీర్పు ఇవ్వడంతో పాటు మరోపక్క చంద్రబాబు వయసు మీద పడటం ఆ పార్టీ నేతలకు భవిష్యత్ గురించి కలవరం మొదలైంది. ఇటువంటి తరుణంలో కొంతమంది నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయిన పరిస్థితి నెలకొంది.
ఇదిలావుండగా పార్లమెంట్ నియోజకవర్గాల ఆధారంగా చంద్రబాబు ఇటీవల పార్టీ పరంగా కొన్ని పదవులను కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతీ 5 పార్లమెంటు స్థానాలకు ఒకరిని ఇన్చార్జి పేరుతో పదవులు అప్పజెప్పడానికి రెడీ అవుతున్నారట. ఇది ఇలా ఉండగా ఇతర పార్టీలతో సమన్వయం చేసే బాధ్యతలను కృష్ణా జిల్లా మాజీ మంత్రి దేవినేని ఉమా కి అప్పగించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారట.
దీంతో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం టీడీపీ కీలక నేతలకు టెన్షన్ పుట్టిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే టీడీపీ నేతల తోనే ఆయన అంతంతమాత్రంగా ఉంటారు, అటువంటిది ఆయనను ఇతర పార్టీల తో సమన్వయం చేయించడానికి ముందుకు పంపించటం అనేది సరైన నిర్ణయం కాదని చాలామంది పార్టీలో ఉన్న సొంత నాయకులు అంటున్నారట. అధికారంలో ఉన్న సమయంలోనే పార్టీలో చాలా మందిని ఆయన దూరం చేసుకోవడం జరిగిందని, ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నాయకులతో సమన్వయం చేసే రీతిలో ఆయనను నియమించడం కరెక్ట్ కాదని చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని పార్టీలో ఉన్న కీలక నేత లే తప్పు పడుతున్నట్లు సమాచారం.