Pawan Kalyan : ఇండస్ట్రీ లో మొదటి నుండి మెగా- కృష్ణంరాజు ఫ్యామిలీస్ చాలా సన్నిహితంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. రెండు కుటుంబాలకు పెద్దలు అయిన కృష్ణంరాజు చిరంజీవి ఇద్దరు కూడా పశ్చిమ గోదావరి జిల్లా వాసులే. దీంతో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో కృష్ణం రాజు కూడా చిరు పార్టీలో జాయిన్ అయ్యి కీలకంగా రాణించడం జరిగింది. అదేవిధంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా మెగా కాంపౌండ్ కి చెందిన హీరోలతో చాలా సన్నిహితంగా బాండింగ్ ఉండేలా వ్యవహరిస్తాడు. ముఖ్యంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ప్రభాస్ కి మంచి స్నేహం ఉంది. అటువంటి వాతావరణం రెండు కుటుంబాల మధ్య నెలకొనడం విశేషం. ఇదిలా ఉంటే రాజకీయంగా పవన్ కళ్యాణ్ Pawan Kalyan తెలుగు రాష్ట్రాలలో జనసేన పార్టీ తరఫున కీలకంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే.
ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ సినిమాల పరంగా కంటే రాజకీయంగా రాణించటం ఇప్పుడు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయినా గాని పవన్ కళ్యాణ్ పార్టీకి ఆదరణ ఎక్కడ కూడా చెక్కుచెదరకుండా ఉండేలా పవన్ వేస్తున్న ఎత్తుగడలు.. ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టించే విధంగా ఉండగా, మిగతా వారిని ఆలోచనలో పడేస్తున్నాయి. పొలిటికల్ గా మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టి.. ఓడిపోయిన తరువాత దాని బ్యాలెన్స్ చేసుకోలేక వెనకడుగు వేస్తూ సినిమాల్లోకి వెళ్లిపోవటం అందరికీ తెలిసి. కానీ పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ ఫుల్ డిజాస్టర్ అయినా గాని.. ఏపీలో తన పార్టీ గ్రాఫ్ ఏ మాత్రం తగ్గకుండా ప్రజలను ఆలోచింపజేసే విధంగా ప్రస్తుత రాజకీయాలు చేయటం పట్ల చాలామంది పవన్ పార్టీ పట్ల గౌరవం పెంచుకునే విధంగా మాట్లాడుతున్నారు. ప్రజలలో మార్పు తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని, ప్రజలు మారితే ఆయన గెలిచే వాళ్లని, సో ప్రజలలో మార్పు రాకపోతే ఆయన ఓడిపోవటం పెద్ద మేటర్ ఏమి కాదు అని అంటున్నారు. ఆయన చేస్తున్న యుద్ధం..ప్రజలలో మార్పు తెచ్చే యుద్ధమని చాలా మంది ప్రముఖులు అంటున్నారు. ఈ క్రమంలో సీనియర్ రెబల్ స్టార్ కృష్ణం రాజు కూడా తాజాగా పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారంపై కీలక కామెంట్లు చేశారు. గత సార్వత్రిక ఎన్నికలలో పవన్ కళ్యాణ్ రాబట్టిన ఆరు శాతం ఓట్లు, మిగతా పార్టీలు ఏవైనా రాబట్టాలి అంటే.. వాళ్లకి 300 కోట్లు ఖర్చు అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ నికార్సైన పొలిటికల్ లీడర్ అన్నట్టు కృష్ణంరాజు అభివర్ణించారు. ఎక్కడా కూడా డబ్బు ఇవ్వకుండా తన భావజాలంతో ప్రజలను ప్రభావితం చేస్తున్న నవతరం నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నట్టుగా కృష్ణంరాజు అభివర్ణించారు.