Krithi shetty : కృతిశెట్టి టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన క్యూట్ హీరోయిన్. గత కొన్నేళ్ళుగా ఒక అప్ కమింగ్ హీరోయిన్ గురించి ఇంతగా ఇండస్ట్రీ వర్గాలలో గాని ప్రేక్షకుల్లో గాని చర్చలు జరిగింది లేదు. నీ కన్ను నీలి సముద్రం అన్న ఒకే ఒక్క సాంగ్ తో అందరినీ ఆకట్టుకుంది కృతి శెట్టి.
చారడేసి కళ్ళేసుకొని అందరి కళ్ళు తనమీదే పడేలా చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి లాంటి లెజెండ్ నుంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పటికే టాలీవుడ్ లో స్టార్ మేకర్స్ అందరూ కృతి శెట్టి గురించి క్యూ కడుతున్నారు.
కృతి శెట్టి డేట్స్ కోసం పెద్ద నిర్మాతలందరూ భారీగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే సినిమాకి దాదాపు 50 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని చెప్పుకుంటున్నారు. తనకున్న డిమాండ్ ని బట్టి బాగానే రెమ్యూనరేషన్ కోట్ చేస్తుందని సమాచారం. ఇప్పటికే నాని తో చేస్తున్న శామ్ సింగ్ రాయ్ సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమాలో సాయి పల్లవి ఉన్నా కూడా హాట్ టాపిక్ మాత్రం కృతి శెట్టి అవుతోంది. సినిమా రిలీజయ్యాక కూడా ఎక్కువగా కృతి శెట్టి గురించే మాట్లాడుకుంటారని ఇప్పటి నుంచే మాట్లాడుకుంటున్నారట.
Krithi shetty : ఈ ఏడాది గడిచే సరికి ఆ లిస్ట్ లో కృతి శెట్టి చేరుతుందని చెప్పుకుంటున్నారు.
ఇక ఇంద్రగంటి మోహన కృష్ణ – సుధీర్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలకి కలిపి కోటి రూపాయల రెమ్యూనరేషన్ అందుకుందని అంటున్నారు. ఒకప్పుడు ఇలియానా కోటి రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకొని హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు పూజా హెగ్డే, రష్మిక మందన్న, సాయి పల్లవి రెండు కోట్ల వరకు అందుకుంటున్నారు. ఇక ఈ ఏడాది గడిచే సరికి ఆ లిస్ట్ లో కృతి శెట్టి చేరుతుందని చెప్పుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే అతి కొద్ది కాలంలోనే బాలీవుడ్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళిపోతుందని అనుకుంటున్నారట.