ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల భామ కృతి శెట్టి. ఈ బ్యూటీ క్వీన్ ఫస్ట్ మూవీతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. కృతి ఇప్పటివరకు మూడు సినిమాల్లో నటించింది. ఆ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సంపాదించాయి. అయితే ఇప్పుడు ఈ యాక్ట్రెస్ ‘ది వారియర్’ సినిమాతో తన అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ రామ్ తో కలిసి రొమాన్స్ చేసింది. ఈ నెల 14 నుంచి ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. ది వారియర్ తో కోలీవుడ్ ఇండస్ట్రీకి కూడా పరిచయం కానుంది కృతి. అయితే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో కృతి శెట్టి రామ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఉస్తాద్ అని ఎందుకంటారో ఇప్పుడు తెలిసింది
“ఇంతకు ముందే నేను రామ్ ఎనర్జీ గురించి, అతని డ్యాన్స్ గురించి విన్నాను. ఈ సినిమాతో కళ్ళారా చూసాను. డ్యాన్స్లో ఆయన ఎనర్జీని అందుకోడం చాలా కష్టం. రామ్ని అందరూ ‘ఉస్తాద్’ అని ఎందుకు పిలుస్తారో నాకు ఇప్పుడు అర్ధం అయింది. రామ్ని చూసి నేను చాలా నేర్చుకున్నా.” అని కృతి చెప్పుకొచ్చింది. “డైరెక్టర్ లింగుస్వామి (Lingusamy) గారు డైమెండ్ అనే విషయం నాకు తెలుసు. ఆ సార్ డైరెక్షన్లో నటించడం నాకు చాలా సంతోషంగా ఉంది. లింగుసామి గారిది మనసు చాలా గొప్పది” అని కృతి శెట్టి తెలిపింది.
దేవిశ్రీతో మరో హిట్
దేవిశ్రీ ప్రసాద్ ఉప్పెన సినిమాకి చాలా పెద్ద హిట్ సాంగ్స్ ఇచ్చారని.. మళ్లీ ఎప్పుడు ఛాన్స్ వస్తుందా ఆయనతో కలిసి వర్క్ చేయడానికి అని ఎదురు చూసినట్లు కృతి చెప్పింది. అయితే తాను ఎంతో కాలం వేచి చూడాల్సిన అవసరం రాలేదని, ఈ సినిమాతో మళ్లీ ఆయనతో కలిసి చేసి ఛాన్స్ వచ్చిందని సంతోషం వ్యక్తం చేసింది. “సుజిత్ నన్ను చాలా అందంగా చూపించారు. అందుకు నేను ఆయనకి ట్యాంక్స్ చెప్తున్నాను. మా మూవీ ది వారియర్ ఈ నెల 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. అందరూ తప్పకుండా చూడండి”. అని కృతి స్టేజ్ మీద ముద్దుముద్దుగా మాట్లాడుతూ అందరి మనసులు దోచేసింది.