Krithi Shetty: ప్రముఖ నటి కృతి శెట్టి ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది. తన మొదటి సినిమా అయిన ఉప్పెన బ్లాక్బస్టర్ హిట్ అవడంతో టాలీవుడ్లో కృతి రేంజ్ ఒక రేంజ్లో పెరిగిపోయింది. ఆ సినిమా తరువాత కృతి నటించిన మరో రెండు సినిమాలు కూడా హిట్ అవడంతో టాప్ హీరోయిన్ల లిస్ట్లో కృతి పేరు చేరింది. అసలయితే కృతి చిన్నపటి నుంచి హీరోయిన్ కావాలని అనుకోలేదు. కానీ ముంబైలో చదువుకుంటున్నపుడు కమర్షల్ యాడ్స్లో నటించింది. దాంతో ఆమెకి హిందీ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.
Krithi Shetty: అదో పెద్ద త్యాగం
బాలీవుడ్లో కృతి మొదటి సినిమా సూపర్ 30. ఈ సినిమాలో కృతి స్టూడెంట్గా నటించింది. ఆ తరువాత ఉప్పెన సినిమాలో బేబమ్మా పాత్రతో బాగా పేరు తెచ్చుకుంది. ఆ తరువాత ఆమెకి శ్యామ్ సింగరాయ్, బంగారాజు సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. ఈ అమ్మడు తన కుటుంబం చేసిన త్యాగం వల్లే హీరోయిన్గా ఎంతో ఎత్తుకు ఎదిగిందని పలువురు సోషల్ మీడియాలో ఈ మధ్య కృతిని బాగా పొగుడుతున్నారు.
ఏంటా త్యాగం?
కృతి శెట్టి 2003వ సంవత్సరం ముంబైలోని తులు కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు కర్ణాటకలోని మంగళూరుకి చెందినవారు. కృతి తండ్రి వ్యాపారరీత్యా ముంబై వచ్చి సెటిల్ అయ్యారు. కృతి తల్లి ఫాషన్ డిజైనర్, ఆమెకి ఒక తమ్ముడు, చెల్లి కూడా ఉన్నారు. ముంబైలో పెరిగిన కృతి సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఇండస్ట్రీలో కృతికి వరుసగా అవకాశాలు రావడంతో ఆమె తల్లి ఫ్యాషన్ డిజైనింగ్ జాబ్ వదిలేసింది. కృతి ఎక్కడికి వెళ్లినా తనకి తొడుగా తన తల్లి కూడా వెళ్లేది. అలా తల్లి తనకెంతో ఇష్టమైన కెరీర్ని వదిలేసి కృతిని హీరోయిన్ చేసిందని ఇటీవలే జరిగిన ఒక ఇంటర్వ్యూలో కృతి చెప్పుకొచ్చింది. దాంతో అందరూ కృతి తల్లి చేసిన త్యాగాన్ని ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం కృతి శెట్టి వరుసగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.