అమరావతి, మార్చి 28: కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలో పిడిఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు ఘన విజయం సాధించారు. గుంటూరులోని ఎసి కాలేజీలో 12 రౌండ్ల పాటు సుదీర్ఘంగా ఓట్ల లెక్కింపు జరిగింది. 68,120 ఓట్ల మెజార్టీతో లక్ష్మణరావు విజయం సాధించారు.
నూతలపాటి అంజయ్య 12,550 ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచారు. మొత్తం 1,49,319 ఓట్లు పోల్ అవ్వగా లక్ష్మణరావుకు 80,670 ఓట్లు వచ్చాయి.
రెండు పర్యాయాలు ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా గెలిచిన లక్ష్మణరావు నేడు పట్టభధ్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా కూడా ఘన విజయం సాధించి హాట్రిక్ రికార్డు సొంతం చేసుకున్నారు.