KTR: ఏపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చీప్ లిక్కర్ స్కీమ్ కు ఏపిలోని రాజకీయ పార్టీల నుండే తెలంగాణ నుండీ స్పందనలు వస్తున్నాయి. నిన్న విజయవాడలో ఏపి బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ప్రజాగ్రహ సభలో తాము అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ క్వార్టర్ రూ.75లకే అందిస్తామని వ్యాఖ్యానించారు. దీనిపై ఇప్పటికే ఏపిలోని పలువురు రాజకీయ పక్షాల నేతలు సోము పై విమర్శలు గుప్పిస్తున్నారు. అయినప్పటికీ సోము వీర్రాజు తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు.
KTR: ఎంత అవమానకరం..?
ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటిఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఏపి బీజేపీ నేతలు మరింత దిగజారిపోయారని కేటిఆర్ విమర్శించారు. “వావ్ వాట్ ఏ స్కీమ్ .. ఎంత అవమానకరం.. ఏపి బీజేపీ కొత్త పథకానికి దిగజారింది. చీప్ లిక్కర్ ను రూ.50లకి సరఫరా చేయాలనే బీజేపీ జాతీయ విధానం ఏపికేనా.. లేదా నిరాశ ‘అధికంగా’ ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ఈ బంపర్ ఆఫర్ ఉందా? అంటూ మంత్రి కేటిఆర్ ట్వీట్ చేశారు ఈ ట్వీట్ కు సోము వీర్రాజు చేసిన ప్రసంగం వీడియోను జత చేశారు.
చీప్ లిక్కర్ రూ.70లకే
విజయవాడ బీజేపీ సభలో సోము వీర్రాజు మాట్లాడుతూ ఏపిలో సంపూర్ణ మద్యనిషేదం అమలు చేస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం..చీప్ లిక్కర్ తాయారు చేసి ప్రజల రక్తాన్ని పిండేస్తుందని విమర్శించారు. మద్యం తాగే ఒక్కొక్కరి నుండి రూ.12వేలు రాబట్టి వాటినే ఏటా అకౌంట్లలో వేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం తాగే కోటి మంది బీజేపీకి ఓటేసి గెలిపించాలని కోరారు. చీప్ లిక్కర్ రూ.70లకే ఇస్తామనీ, రాబడి బాగుంటే రూ.50 లకే ఇస్తామని పేర్కొన్నారు.