ఆంధ్రప్రదేశ్ పట్టణ ప్రాంతాల్లో వార్డు వాలంటీర్ ల వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకొని వచ్చిన విధంగానే తెలంగాణ ప్రభుత్వం కూడా అదే పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో ఒక గ్రామానికి ఒక సచివాలయం తో పాటు అక్కడి ఆఫీసర్లకు సహకరించేందుకు గ్రామ వాలంటీర్లను నియమించి… ప్రజలను అధికారులతో నేరుగా అనుసంధానం చేసే వ్యవస్థ ను జగన్ తీసుకొని వచ్చారు. ఇక పట్టణాల్లో అయితే వార్డు వాలంటీర్ అక్కడి ప్రజలకు కావాల్సిన సేవలను తక్షణమే అందేలా చూస్తున్నారు.
కొద్ది మార్పులతోతెలంగాణ ప్రభుత్వం కూడా ఇలాంటి అధికారులనే ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు. మున్సిపల్ శాఖ పై సమీక్ష జరిపి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే ఆఫీసర్లను నియమించాలని నిర్ణయించారు. దేశంలోనే తొలిసారిగా వార్డుకు ఒక ఆఫీసర్ ని నియమించే ప్రక్రియ త్వరలోనే మొదలవుతుందని కేటీఆర్ ప్రకటించారు. అయితే ఏపీ లో మాత్రం వాలంటీర్లు గా చలామణి అవుతున్న వారు ప్రభుత్వ అధికారులు కాదు.
ఇక తెలంగాణలో వార్డు ఆఫీసర్లు అనేవారు పురపాలక చట్టం నిర్దేశించిన పారిశుద్ధ్యం హరితహారం తో పాటు ఇతర కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయడానికి కృషి చేస్తారు. నిజానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొని వస్తున్న కొత్త మున్సిపల్ చట్టం ఎప్పటి నుండో అమల్లోకి రావాల్సి ఉంది. అయితే కరోనా కారణం మీద అమలుచేయడానికి ఆలస్యం అవుతున్నప్పటినుండి ఇప్పుడు దానిని దృష్టిలో పెట్టుకుని కొత్తగా అధికారుల సిస్టమ్ ని కేటీఆర్ అమలు చేయబోతున్నాడు. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఉన్న చట్టం ప్రకారం మొక్కలకు ప్రజాప్రతినిధులు ఇంతకుముందు బాధ్యులను చేశారు. అయితే ఈ చట్టం ప్రకారం పాలన సాగాలంటే పర్యవేక్షణ వ్యవస్థ ఉండాల్సిందేనని ప్రజలకు అందుబాటులో ఉండే ఉద్యోగి అవసరం తెలుసుకున్న కేటీఆర్ వార్డు ఆఫీసర్ల ఉద్యోగాలను సూచిస్తున్నట్లు నిర్ణయించుకున్నారు.
ఇక తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా చెప్పబడుతున్న కేటీఆర్ ఇటీవల కాలంలో తన శాఖలో మాత్రమే కాకుండా మొత్తం పాలనలో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. పాలనలో అనూహ్య మార్పులు తీసుకు వస్తూ.. కరోనా సమయంలో చురుగ్గా పర్యటిస్తూ…. అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నారు ఇక కొన్ని వేల కోట్లతో హైదరాబాద్ చుట్టుపక్కల ఫ్లై ఓవర్లను ప్రారంభించి ఆ పనులు జోరుగా సాగేలా చూస్తున్నారు. ఇక ఈ సమయంలో అక్కడక్కడ జగన్ ను ఫాలో కావడమ్ అనివార్యమైపోయింది.