KTR : తెలంగాణ మంత్రి కేటీఆర్ బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మధ్య ఆసక్తికరమైన ట్వీట్లు సాగాయి.ముందుగా బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రారావు చేసిన ట్వీట్ పై మంత్రి కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు. ఓయూ చేరుకున్నా..మీరెక్కడా అంటూ..కేటీఆర్ కు రామచంద్రారావు ట్వీట్ చేశారు. ఆయనకి ట్విట్టర్ వేదికగానే సమాధానం ఇచ్చారు మంత్రి కేటీఆర్. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడి నుంచి తెలుసుకొనే పనిలో బిజీగా ఉన్నా…జన్ ధన్ ఖాతాలో మోదీ..రూ. 15 లక్షలు వేశారో లేదో తెలుసుకుంటున్నట్లు సెటైర్ వేశారు. ఎన్డీయే అంటే..నో డేటా అవైలబుల్ అంటూ ఎద్దేవా వేశారు.
KTR : కేటీఆర్ ప్రకటన తో రేగిన వివాదం
స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రికార్డు స్థాయిలో ఉద్యోగాలు కల్పించామన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కంటే.. తెలంగాణ ప్రభుత్వమే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. తెలంగాణ వచ్చాక లక్షా 32 వేల 799 ఉద్యోగాలను ఇచ్చామని.. ఈ విషయంపై ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నట్టు కేటీఆర్ విసిరిన సవాల్తో దుమారం రేగింది.
మంత్రిని టార్గెట్ చేసిన కాంగ్రెస్ బీజేపీ
కేటీఆర్ సవాల్ను సీరియస్గా తీసుకున్నాయి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. ఉద్యోగాల కల్పనపై మంత్రి కేటీఆర్ను టార్గెట్ చేశాయి. ఇదే విషయమై మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ దాసోజు శ్రావణ్ లమధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరగటం తెలిసిందే . ఇప్పటికే కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ సవాల్కు ఓకే అంటూ.. గన్ పార్క్ వద్ద నిరసనకు దిగారు.ఇక బీజేపీ సోమవారం ఉస్మానియాలో చర్చకు సిద్ధమైంది.లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశారంటున్న కేటీఆర్.. చెప్పేవి వాస్తవాలే అయితే చర్చకు రావాలంటూ సవాల్ విసురుతున్నారు బీజేపీ నేతలు. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన ఉస్మానియా యూనివర్సిటీలోనే.. ఉద్యోగాలపై కేటీఆర్తో బహిరంగ చర్చకు సిద్ధమన్నారు బీజేపీ లీడర్స్. అందులో భాగంగానే…ఎమ్మెల్సీ రామచంద్రరావు అక్కడకు చేరుకున్నారు.ఈ సందర్భంగానే వారి మధ్య ట్వీట్ల యుద్ధం సాగింది!పట్టభద్రుల
నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించటం లేదు.