గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బాధ్యతను భుజాన వేసుకున్న టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే రీతిలో సోషల్ మీడియాలో పోస్టింగులు తప్ప బిజెపి గ్రౌండ్ లెవెల్ లో తెలంగాణలో అంత సీన్ లేదని తేల్చి చెప్పేశారు. మతం పేరుచెప్పి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని కానీ హైదరాబాద్ గడ్డ లోనే పరమతసహనం ఉందని పేర్కొన్నారు. బిజెపి కంటే టిఆర్ఎస్ పార్టీ నాయకులకు దేశభక్తి ఎక్కువ అని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో చిచ్చు పెట్టాలనుకునే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ స్పష్టం చేశారు. పరిస్థితిలో ఉండగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరఫున ఈసారి సిట్టింగులకు టికెట్ ఇవ్వకుండా వేరే వారికి ఇచ్చే ఆలోచనలో కేటీఆర్ ఉన్నట్లు సమాచారం. కారణం చూస్తే ఇటీవల నగరంలో వచ్చిన వరదలకు చాలా మంది టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో టిఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడినట్లు, దీంతో మళ్లీ సిట్టింగులకు అవకాశం ఇస్తే పార్టీ డామేజ్ అయ్యే అవకాశం ఉందని కేటీఆర్ డిసైడ్ అయ్యారట.
దీంతో కొత్తవారికి పార్టీ టికెట్ జిహెచ్ఎంసి ఎన్నికలలో ఇచ్చే యోచనలో కేటీఆర్ రెడీ అయినట్టు సమాచారం. అంతేకాకుండా హైదరాబాద్ నగర పరిధిలో ఉండే బిజెపి నాయకులను టిఆర్ఎస్ పార్టీలో వచ్చే రీతిలో కేటీఆర్ నయా స్ట్రాటజీ ఉపయోగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బిజెపి స్పోక్స్ పర్సన్ శ్రీధర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ లోకి రావడం జరిగింది. ఈ క్రమంలో మరికొంత మంది బీజేపీ నేతలను టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చే రీతిలో కేటీఆర్ రాజకీయం స్టార్ట్ చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా టిఆర్ఎస్ పార్టీని ఇబ్బందులపాలు చేయాలనుకున్న బీజేపీకి అదేస్థాయిలో చెక్ పెట్టే రీతిలో కేటీఆర్ వ్యూహాలు సిద్ధం చేసినట్లు సమాచారం.