KTR: సాయుధ బలగాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకంపై విపక్షాల నుండి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు జరిగాయి. వివిధ రాజకీయ పక్షాలు వ్యతిరేకిస్తున్నా, ఆర్మీ అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నా కేంద్రం మాత్రం ఈ పథకం అమలుపై తగ్గేదె లే అంటోంది. అగ్నిపథ్ నియామకాల కోసం త్రివిధ దళాధిపతులు ఇప్పటికే షెడ్యుల్ కూడా ప్రకటించారు. అయితే అగ్నిపథ్ పథకంపై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంకలో భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ, ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ అవినతి బంధంపై వస్తున్న ఆరోపణలపై దేశం దృష్టి మరల్చేందుకే ఈ పథకాన్ని ప్రకటించారా అని కేటిఆర్ ప్రశ్నించారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
శ్రీలంకలో ఓ విద్యుత్ ప్రాజెక్టును ఆదానీ గ్రూపు దక్కించుకుంది. ఆదానీ గ్రూపుకు విద్యుత్ ప్రాజెక్టు దక్కేలా శ్రీలంక ప్రభుత్వంపై మోడీ ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. శ్రీలంకలో ఓ విద్యుత్ ప్రాజెక్టు ను ఆదానీ గ్రూపునకు ఇచ్చేలా లంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స పై మోడీ ఒత్తిడి తెచ్చారంటూ సీలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ) చైర్మన్ ఎంఎంసీ ఫెర్డినాండో వ్యాఖ్యానించడం సంచలనం అయ్యింది. ఆ తర్వాత ఫెర్డినాండో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, తన పదవికి రాజీనామా చేశారు. కానీ ఆ వ్యాఖ్యలపై భారత్ లో విపక్షాలు మోడీపై భగ్గుమన్నాయి. మరో పక్క శ్రీలంకలో మోడీ, ఆదానీకి వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎందుకు నోరు మెదపడం లేదని కేటిఆర్ ఇంతకు ముందే బీజేపీని, మోడీని పశ్నించారు. తాజాగా అగ్నిపథ్ పథకాన్ని ఈ వివాదానికి ముడి పెడుతూ డైవర్షన్ పాలిటిక్సా అన్నట్లుగా కేటిఆర్ ట్వీట్ చేశారు.
Was #AgnipathScheme announcement just a ruse to divert India’s attention from #Srilanka allegations on Modi – Adani corruption nexus?#JustAsking
— KTR (@KTRTRS) June 20, 2022