Vizag Steel Plant : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ Vizag Steel Plant ప్రైవేటీకరణ చుట్టూ తిరుగుతున్నాయి అన్న సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయడాన్ని అన్ని రాజకీయ పార్టీలతో పాటు కార్మిక సంఘాలు కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఆంధ్ర రాష్ట్రం పక్క తెలుగు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి చెందిన మంత్రి కేటీఆర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఈ విషయంపై స్పందించారు. కేంద్రం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తప్పు పట్టారు. జరుగుతున్న పోరాటానికి మద్దతు తెలుపుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ విధంగా మద్దతు తెలపగా పోతే రాబోయే రోజుల్లో కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో బీహెచ్ఈఎల్, సింగరేణి ఇలా అన్నింటినీ అమ్మేస్తారని ప్రైవేటీకరణ చేసే పరిస్థితి ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. అలా చూస్తూ ఊరుకుంటే పోతే రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మోడీ సర్కార్ ప్రైవేటీకరణ చేసే విధంగా వ్యవహరిస్తుంది అంటూ సెటైర్లు వేశారు.
ఏదిఏమైనా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నట్లు ..రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఇదే పరిస్థితి వస్తే కనుక తమతో కలిసి పోరాటానికి కూడా రావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఏపీ సీఎం వైఎస్ జగన్ అఖిలపక్ష సంఘాల నాయకులతో పాటు కార్మికులతో కలిసి మోడీతో భేటీ అవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చాలా వరకు వైజాగ్ లో వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఈ విషయాన్ని ఖండిస్తూ పార్టీలకతీతంగా ఆందోళనలు నిరసనలు చేపడుతూ ..విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ అవ్వకుండా ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారు. మరో పక్క కేంద్రం మాత్రం ఈ విషయంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. దీంతో విశాఖ ఉక్కు కర్మాగారం సమస్య రాజకీయంగా రోజురోజుకీ వేడెక్కుతోంది.