KTR: సినీనటుడు సోనుసూద్ చాలా కాలం తర్వాత హైదరాబాద్ కి విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ తో.. సోనుసూద్ భేటీ అయ్యారు. కరోనా లాంటి కష్ట సమయంలో సోనుసూద్ చేసిన సేవలనీ ఈ సందర్భంగా కేటీఆర్ కొనియాడటం జరిగింది. అంతేకాకుండా సోనూసూద్ కి శాలువా కప్పి జ్ఞాపికను అందజేసి.. బహుకరించారు.
ప్రగతి భవన్లో జరిగిన ఈ సమావేశంలో.. నటుడు సోను సూద్ తో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు.. మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కొంతమంది నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో మౌలిక వైద్య సదుపాయాల వికేంద్రీకరణ అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే సోను సూద్ తెలంగాణ రాష్ట్రంలో.. చాలా జిల్లాల్లో అనేక కార్యక్రమాలు పేదలకోసం చేపట్టడం జరిగింది.
Read more: Sonu sood: ఏపీలో ఆ జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన సోను సూద్..!!
కరోనా లాంటి కష్ట సమయంలో తెలంగాణ రాష్ట్రంలో అనేక మందికి ఆక్సిజన్ సిలిండర్లు కూడా సోను సూద్ టీం అందించడం జరిగింది. అనేక మంది పేద పిల్లలను కూడా చదివిస్తూ మరికొంత మంది పేద తల్లిదండ్రులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ..సోను సూద్ చేస్తున్న మంచి పనులకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కొన్ని జిల్లాలలో సోను సూద్ విగ్రహాలు కూడా ఏర్పాటు చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు. మరోపక్క సోనూసూద్ దేశవ్యాప్తంగా.. వివిధ రాష్ట్రాలలో అనేక మంచి కార్యక్రమాలు చేపడుతూ.. పేదలను ఆదుకునే రీతిలో తన వంతు కృషి చేస్తున్నారు.