KTR : తెలంగాణ మంత్రి కేటీఆర్ KTR సొంత జిల్లా సిరిసిల్లలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. జిల్లాలోని గంభీరావుపేట మండల కేంద్రంలో రూ. 2.25 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ నర్మాలలో రైతు వేదిక ప్రారంభోత్సవం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు విద్యార్థులకు అందిస్తున్న పాలన గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రైతులకు కరెంటు కోతలు భారీ స్థాయిలో ఉండేవని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తెలిపారు. అప్పట్లో ఉన్న పాలకులు ఆరు గంటలు కరెంట్ అని అదేవిధంగా 9 గంటల కరెంటు అంటూ అనేక ప్రకటనలు చేశారు, కానీ ఏనాడు ఏకధాటిగా కరెంటు ఇచ్చిన పరిస్థితి లేదని తెలిపారు. అప్పుడు ఒక రెండు గంటలు ఇంకొక సమయం తర్వాత మరో రెండు గంటల్లో ఆ రీతిగా కరెంట్ ఇవ్వడం వల్ల అప్పట్లో కరెంట్ షాక్ వల్ల రైతులు చనిపోవటం పాము కాటు వల్ల కూడా చనిపోవడం వంటి దుస్థితిలో తెలంగాణ రైతాంగం ఉండేదని కానీ ఇప్పుడు అలాంటి సమస్యలు లేవని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే దేశంలోనే ఉచితంగా వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అంటూ కొనియాడారు. 70 సంవత్సరాల వయసు కలిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచించిన మాదిరిగా ప్రధాని అయిన ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు అయినా ఆలోచించారా అంటూ రైతులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బా మాటలు మాట్లాడే కాంగ్రెస్ మరియు బీజేపీ నేతలకు ఇదే సంచలన సవాల్ మీరు ఇవ్వగలరా అంటూ కేటీఆర్ బెంబేలెత్తిన సవాల్ విసిరారు. మీరు పరిపాలించే రాష్ట్రాలలో ఈ విధంగా రైతులకు మేలు చేయగలరా అంటూ ఛాలెంజ్ చేశారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ రైతాంగం లో సంతోషం నెలకొంది అని స్పష్టం చేశారు. ఇదేరీతిలో రాబోయే రోజుల్లో తెలంగాణ రైతాంగం మరింత లాభం పడేలా టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?