Telangana : టీ కాంగ్రెస్ మాజీ పిసిసి ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పై నిప్పులు చెరిగారు.
మేటర్ లోకి వెళితే తెలంగాణ యువతను మోసం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగంలో లక్ష 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పిఆర్సి నివేదికలో తేలిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలో వెంటనే ఆ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఇప్పటి వరకూ ఈ లక్ష 91 వేల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదు అంటూ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయకుండా తెలంగాణ యువతను దగా మోసం చేశారు అంటూ కేసిఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. ఇటీవల మొన్న ఏదో ఒక సమావేశంలో కేసిఆర్ 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నట్లు డబ్బా మాటలు చెబుతున్నారు, అదేం కాదు మొత్తం లక్షా తొంభై ఒక వేల ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నట్లు ఉత్తంకుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగాల ఇచ్చినట్లు అబద్ధాలు చెప్పిన కేసీఆర్ వెంటనే తెలంగాణ యువతకి క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం వెనకబడి పోయిందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రమే కాక వివిధ పార్టీల నాయకులు తెలంగాణ యువత కూడా ఆరోపిస్తోంది. ముఖ్యంగా వివిధ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ లో పోస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వ శాఖలు ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని విపక్షాల నుంచి అదేవిధంగా తెలంగాణ యువత నుండి భారీ స్థాయిలో డిమాండ్ వినబడుతోంది.