KTR టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మంత్రి కేటిఆర్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. టాలివుడ్ డ్రగ్స్ కేసును పురస్కరించుకుని మంత్రి కెటిఆర్ పై రేవంత్ రెడ్డి సవాల్ విసరడం, దానికి మంత్రి కేటిఆర్ చర్లపల్లి జైలుకు వెళ్లి వచ్చిన వారితో కాదు రాహుల్ గాంధీతో అయితే ఛాలెంజ్ కు సిద్ధమంటూ ట్వీట్ చేశారు. ఓ పక్క ఇద్దరి మధ్య ట్వీట్ ల వార్ తారా స్థాయికి చేరిన నేపథ్యంలో అసత్య ఆరోపణలకు ముగింపు పలకాలన్న ఉద్దేశంతో మంత్రి కేటిఆర్ హైకోర్టులో పరువునష్టం దావా వేశారు. తన పై వదంతులు, లేని పోని అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన కేటిఆర్..న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు.
“ఉద్దేశపూర్వకంగా నాపై దుష్ర్పచారం చేస్తున్నారు. చట్టపరమైన చర్యలకు కోర్టును ఆశ్రయిస్తున్నా. న్యాయస్థానంలో పరువు నష్టం దావా దాఖలు చేశా. దుష్ప్రచారం చేస్తున్నా వారిపై కోర్టు చర్యలు తీసుకుంటుందని విశ్వసిస్తున్నా” అని కేటిఆర్ ట్వీట్ చేశారు. ఆరోపణలు, ప్రత్యారోపణల వివాదం పరువునష్టం దావా వరకూ వెళ్లడంతో రేవంత్ రెడ్డి రెడ్డి దీనిపై ఏ విధంగా స్పందిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.