మంత్రి కేటీఆర్ తాజాగా యాంకర్ సుమ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ లో వచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ రాజకీయాల గురించి అదేవిధంగా కుటుంబం గురించి అనేక విషయాలు తెలియజేశారు. ఈ క్రమం లో డబుల్ బెడ్ రూమ్ గురించి కేటీఆర్ మాట్లాడుతూ.. పేదవాళ్ల ఇళ్ల విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చాలా క్వాలిటీగా ఆలోచించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టించినట్లు స్పష్టం చేశారు.
ఏదో ఇల్లు ఇచ్చాము అన్నట్టు.. అగ్గిపెట్టె, డబ్బా లాంటి ఇల్లు కాకుండా సువిశాలమైన ఇల్లు నిజమైన డబల్ బెడ్ రూమ్ ఎలా ఉంటుందో అలాంటి ఇళ్లను ఇచ్చినట్లు స్పష్టం చేశారు. అందువల్లే పేద వాళ్లకి ఇస్తున్న డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కి డిగ్నిటీ హౌస్ అనే నామకరణం చేసినట్లు స్పష్టం చేశారు. ఇదే క్రమంలో ప్రతిపక్షాలు విమర్శలు చేసిన సమయంలో ఏ విధంగా వాటిని తీసుకుంటారు అనే ప్రశ్నకు కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒకానొక సమయంలో ఒక పార్టీకి చెందిన నాయకుడు నా కొడుకు బాడీషేప్ గురించి దారుణమైన వ్యాఖ్యలు చేశారు ఆ సమయంలో నాకు చాలా కోపం వచ్చింది అని కేటీఆర్ తెలిపారు. అసలు రాజకీయ విమర్శలలో ఇంటి సభ్యులను తీసుకు రావటం ఏమిటి అని ప్రశ్నించారు. ఏదైనా కోపం ఉంటే నన్ను విమర్శించాలి గాని ఇంట్లో పిల్లల్ని విమర్శించటం ఇలాంటి సందర్భాలు చూసిన సమయంలో అనవసరంగా రాజకీయ ఫీల్డులోకి ఎందుకు వచ్చామా అని అనిపిస్తుందని, అసలు రాజకీయాలు అవసరమా అనే బాధ కూడా వస్తుందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇంట్లో ఉన్న పిల్లలు ఎందుకు తిట్లు తినాలి అనే ప్రశ్నలు మదిలో మెదిలేవి అంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు.