Jagan : ఏపీ సీఎం జగన్ Jagan పై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సంచలన కామెంట్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా రాణించిన లగడపాటి రాజగోపాల్.. విభజన జరిగిన తర్వాత సైలెంట్ అయిపోయిన సంగతి తెలిసిందే. రాష్ట్రం విడిపోయే పరిస్థితి ఉండదని ..అదే జరిగితే తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని అప్పట్లో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ప్రస్తుతం అదే రీతిలో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఎలా ఉంటే సరిగ్గా ఎన్నికల సమయంలో సర్వే లు అంటూ వార్తల్లో నిలిచే లగడపాటి తాజాగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విజయవాడలో ఓటు హక్కును వినియోగించుకుని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ గురించి మాట్లాడుతూ..జగన్ రాజకీయాల్లోకి రాకముందు నుండి తనకు ఆయనతో పరిచయం ఉన్నట్లు స్పష్టం చేశారు.
జగన్ పాలన ఎలా ఉంది అన్నది మూడు సంవత్సరాల తర్వాత తెలుస్తుంది అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాజకీయ పార్టీల మధ్య పోటీ వాతావరణం ఎక్కువైపోయింది అందుకే ఓటర్లను ప్రజలను ఆకర్షించడానికి పార్టీలు సంక్షేమ పథకాల కు పెద్దపీట వేస్తున్నట్లు స్పష్టం చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సంక్షేమ మరియు అభివృద్ధి చాలా సమానంగా ఉండేవాణ్ణి పేర్కొన్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటాను అని గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు అదేవిధంగా రాజకీయ సర్వే లకు సైతం దూరంగా ఉంటున్నట్లు పేర్కొన్నారు. అంత మాత్రమే కాక రాష్ట్రంలో జరుగుతున్న ఆలయాలపై దాడుల విషయంలో పోలీసులు మరియు ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ..దాడులకు గల కారణాలను గుర్తించాలని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఓడిపోయినా గాని ..ఆయనను ప్రజలు ఆదరించటం నిజంగా హర్షించదగ్గ విషయం అని ప్రశంసించారు. ఎన్నికల్లో ఓడిపోయినా గాని స్థానిక ఎన్నికల్లో అవేమీ పట్టించుకోకుండా పోటీకి దిగడం అభినందనీయమని పేర్కొన్నారు.