Lakshmi manchu: బుల్లితెరపై టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలను డీల్ చేయడంలో సిద్ధహస్తురాలు మంచు లక్ష్మి. టాప్ సెలబ్రిటీల చేత సమాజంలో అనేక మంది పేద వాళ్ళని ఆదుకోవడంలో కీలక పాత్ర పోషిస్తూ జెమినీలో అప్పట్లో చేసిన నేను సైతం కార్యక్రమం చాలా క్లిక్ అయింది. “నేను సైతం” కార్యక్రమం ద్వారా అనేక మంది పేదవాళ్ళు అదేరీతిలో కుటుంబాన్ని కోల్పోయి విధవరాలు గా ఉన్నవాళ్లు, చదువుకోలేని పేద విద్యార్థులకు కూడా ఈ కార్యక్రమం ద్వారా మంచు లక్ష్మి స్టార్ సెలబ్రిటీల చేత హెల్ప్ చేయించడం జరిగింది.
ఈటీవీ లో కూడా కొన్ని షోలలో ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వారిని మంచు లక్ష్మి ఇంటర్వ్యూ చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా “ఆహా” స్ట్రీమ్ వారు మంచు లక్ష్మి చేత ఒక డిఫరెంట్ షో ప్లాన్ చేసినట్లు సమాచారం. విషయంలోకి వెళితే ఈ షోలో మంచు లక్ష్మి .. రకరకాల వంటకాలు చేయటం మాత్రమేకాక టాప్ సెలబ్రిటీల చేత చేయించనునట్లు టాక్.
Read more: Manchu Lakshmi: మంచు అక్కకి హ్యాకర్లు పెద్ద షాక్ ఇచ్చారు..!!
మంచు లక్ష్మి చేత ఇండస్ట్రీలో టాప్ సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొని రకరకాల వంటకాలు చేయనున్నట్లు.. అనగా ఏ సెలబ్రిటీ అయితే షో కి హాజరు అవుతాడు అతనికి వచ్చిన డిఫరెంట్ వంటకాన్ని.. చేసేలా షో “ఆహా భోజనంబు” అనే టైటిల్ పెట్టినట్లు సమాచారం. త్వరలోనే ఈ షో కి సంబంధించి పూర్తి వివరాలు తెలియనున్నాయి. గతంలో “ఆహా” స్ట్రీమ్ లో సమంత చేసిన శాంతో జామ్ షో సూపర్ డూపర్ హిట్ అయింది. మరి ఇప్పుడు మంచు లక్ష్మి షో ఏ మాదిరి రాణిస్తుందో చూడాలి.