హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణ మే 13 నుంచి ప్రారంభం కానుంది.
చంద్రబాబుకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని 2005లో నందమూరి లక్ష్మీపార్వతి ఏసిబికి ఫిర్యాదు చేశారు. అయితే, ఈ కేసు విచారణ జరగకుండా చంద్రబాబు హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు.
కాగా, దీర్ఘకాలికంగా ఉన్న స్టేలను రద్దు చేయాలని ఇటీవల సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. దీంతో చంద్రబాబు తెచ్చుకున్న స్టే రద్దయ్యింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై దాఖలు చేసిన కేసును కొనసాగిస్తారా? ఉపసంహరిస్తారా? అంటూ ఏసిబి కోర్టు లక్ష్మీపార్వతిని కోరింది. ఈ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరుకావాలని లక్ష్మీ పార్వతికి సమన్లు జారీ చేసింది.
దీంతో లక్ష్మీపార్వతి శుక్రవారం కోర్టు ముందు హాజరయ్యారు. తదుపరి విచారణను కోర్టు వచ్చే నెల 13కు వాయిదా వేసింది.