(పాట్నా “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆర్జెడికి భారీ షాక్ తగిలింది. ఆర్జెడి కీలక నేత రఘువంశ ప్రసాద్ పార్టీకి రాజీనామా చేశారు. రఘువంశ ప్రసాద్ యుపిఏ హయాంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్కు నమ్మిన బంటుగా ఉన్న రఘువంశ ప్రసాద్ పార్టీకి గుడ్ బై చెప్పడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం కల్గించింది.
బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్లో జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎన్నికలు వాయిదా వేయాలని పలు పార్టీల నేతలు కోరుతున్నాయి. కరోనా నేపథ్యంలో బీహార్లో ఎన్నికలు వాయిదాకై సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఫలితం లభించలేదు. కేంద్ర ఎన్నికల సంఘం గడువులోపే ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించింది. ఈ తరుణంలో ఆర్జెడి కీలక నేత రఘువంశ ప్రసాద్ పార్టీ కి రాజీనామా చేయడం లలూ ప్రసాద్ కు గట్టి దెబ్బగా భావిస్తున్నారు.