గుంటూరు, జనవరి 12: గుంటూరు జల్లా పిడుగురాళ్లలో శనివారం మధ్యాహ్నం రెండు సెకన్లు పాటు భూమి కంపించింది. ఈ భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పెద్ద శబ్దంతో భూమి కంపించడంతో ఇళ్లలో నుండి ప్రజలు ఒక్కసారిగా రోడ్డు మీదకు పరుగులు తీసారు. ఎటువంటి నష్టం సంభవించలేదు. క్వారీల్లో బ్లాస్టింగ్ శబ్దాలు అయి ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు.
previous post
next post