నేడు సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు భారీ ఎత్తున తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు జరుపుతున్నారు. మొన్నటి వరకు సినిమా రంగంలో రాణించిన రజిని కొత్త ఏడాదిలో పొలిటికల్ ఫీల్డ్ లోకి దిగుతున్న నేపథ్యంలో ఈసారి సేవా కార్యక్రమాలు భారీ ఎత్తున చేస్తున్నారు ఫ్యాన్స్. మొన్నటి వరకు పొలిటికల్ ఎంట్రీ విషయంలో ఫ్యాన్స్ ని సస్పెన్స్ లో పెట్టిన రజనీకాంత్ మొన్న క్లియర్ కట్ గా సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చేశారు.
దీంతో రజిని ఎంట్రీతో తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఖచ్చితంగా మారిపోతుందని ఆయన ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఈ నెల 31వ తారీఖున కొత్త పార్టీకి సంబంధించి అన్ని విషయాలు వెల్లడిస్తానని రజిని తెలపడం మనకందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించి గ్రౌండ్ వర్క్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఎన్నికల సంఘం వద్ద పార్టీ పేరును రిజిస్టర్ చేయడానికి రెడీ అవుతున్నారు.
అదే క్రమంలో సన్నిహితులతో భేటీ అవుతూ సూచనలు కూడా తీసుకుంటున్నారు. బూత్ కమిటీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ క్యాడర్ ని కూడా బలపరచుకొనే కార్యక్రమాలు ఇప్పటి నుండే స్టార్ట్ చేసేసారు రజిని. దీంతో తలైవా ఎంట్రీ ఇచ్చాక ఆయన క్యాంపెయిన్ ఏ రేంజ్ లో ఉంటుందో ఇతర పార్టీల అంచనాలు వేయలేకపోతున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రజినీకాంత్ వొంటరిగా పోటీకి దిగుతారా..? లేదా వేరే పార్టీతో జతకట్టి పోటీకి దిగుతారా అనే విషయం గురించి తమిళనాడు రాజకీయాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.