తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. ముందు రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయాన్ని పెద్దగా పట్టించుకోని కేసీఆర్…. తెలంగాణ రాష్ట్రంలోని విపక్షాలు అదేపనిగా ప్రజలపై, ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకుని రావడంతో ఇక వేరే దారి లేక ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై కేసీఆర్ ఒక మినీ యుద్ధమే ప్రకటించాడు. ఇలాంటి సమయంలో జగన్…. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రితో మిత్రత్వం పక్కనపెట్టి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ అతనితో కయ్యానికి కాలు దువ్వాడు.
ఇప్పుడు ఇదే క్రమంలో రెండు రాష్ట్రాలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులు అక్రమమైన అంటే…. ఈ ప్రాజెక్టులు పక్క రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయని విపరీతంగా తిట్టుకుంటున్నారు. ఈ సమయంలో సంధి చేసేందుకు దిగిన అపెక్స్ కౌన్సిల్ను ఇప్పటికే ఒకసారి కెసిఆర్ ఎగ్గొట్టాడు. జగన్ మాత్రం పక్కా ఆధారాలతో, పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉన్న దశలో కేసీఆర్ మీటింగ్ కి మొగ్గు చూపకుండా క్యాబినెట్ సమావేశం నిర్వహించడం విశేషం. అయితే ఇప్పుడు కేసీఆర్ కు ఇప్పుడు జగన్ పై సాధించే అవకాశం వచ్చింది.
నేషనల్ గ్రీన్.. రాయలసీమ ట్రిబ్యునల్ రాయలసీమ ఎత్తిపోతల పథకం కి సంబంధించిన కేసు ని రీ- ఓపెన్ చేసేందుకు నిర్ణయించుకుంది. ఇప్పటికే తెలంగాణ పౌరుడు ఒకతను ఫైల్ చేసిన పిటిషన్ అంగీకరించిన ఎన్జీటీ ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫైల్ చేసిన మరొక పిటిషన్ కు కూడా ఇక టిఆర్ఎస్ ప్రభుత్వం తమకు మరిన్ని ఆధారాలు సమకూర్చుకునేందుకు దుకు కొద్దిగా సమయం కావాలని చెప్పగా జస్టిస్ రామకృష్ణ నేతృత్వం వహిస్తున్న ఆగస్టు 28వ తేదీన తెలంగాణ ప్రభుత్వం యొక్క వాదనలు వినేందుకు రెడీ అయ్యారు. ఇకపోతే రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నాలుగు రాయలసీమ జిల్లాల తో సహా ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని 19 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అయితే ఇదే జరిగితే దక్షిణ తెలంగాణలో మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల అన్యాయమైపోతాయని తెలంగాణ వాదన. మరి ఎన్జీటీ ఎవరి వాదనతో ఏకీభవిస్తుందో చూద్దాం.