Breaking: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ త్వరలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయనున్నట్లు మొన్నటివరకు వార్తలు వచ్చాయి. ఇంకా చేరిక లాంఛనం అన్న సమయానికి చివరి నిమిషంలో కాంగ్రెస్ కి ఊహించని షాక్ పీకే ఇవ్వటం జరిగింది. తాజాగా ఈ విషయాన్ని ప్రశాంత్ కిషోర్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
“కాంగ్రెస్ పార్టీ..”ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్” లో చేరాలని.. ఎన్నికల బాధ్యత తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన బాధ్యత వినమ్రంగా తిరస్కరిస్తున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కి.. నా అభిప్రాయం ప్రకారం… నా కంటే ముఖ్యంగా పార్టీకి సరైన నాయకత్వం వహించేవారు ఉండాలి. అదేవిధంగా పార్టీలో అంతర్గతంగా లోతుగా పాతుకుపోయిన సమస్యలను పరిష్కరించుకోవడం అత్యవసరం. దీంతో కాంగ్రెస్ లో జాయిన్ అవ్వాలి అని కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన ఆఫర్ నీ తిరస్కరిస్తున్న..అని ప్రశాంత్ కిషోర్ అని తెలియజేశారు. ఈ పరిణామంతో కాంగ్రెస్ డైలమాలో పడిపోయినట్లు.. జాతీయ రాజకీయాల్లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ డౌన్ లో ఉంది. ఈ క్రమంలో పీకే కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేస్తున్నట్లు .. మొన్నటి దాక వార్తలు రాగా ఇప్పుడు ఆయన తిరస్కరించినట్లు స్వయంగా చెప్పటంతో ఇంకా కాంగ్రెస్ పార్టీని ఎవరు కాపాడలేరు అన్న వాదనలు జాతీయ రాజకీయాల్లో వినబడుతున్నాయి.