బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు లాస్య బాగా ఫేమస్ అయింది అంటే పప్పుతోనే. సోషల్ మీడియాలో మీమ్స్ కూడా విపరీతంగా వచ్చాయి పప్పు మీద. లాస్యక్క పప్పు అంటూ బిగ్ బాస్ హౌస్ లో కూడా మిగితా కంటెస్టెంట్లు లాస్యను ఎక్కిరించేవారు. తన పప్పు తిని బిగ్ బాస్ కంటెస్టెంట్లకు మోషన్స్ అయ్యాయని.. అందుకే తనను నామినేట్ చేస్తున్నానని దివి చెప్పిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి లాస్య పప్పుతో తెగ ఫేమస్ అయిపోయింది.
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక కూడా లాస్య పప్పు గురించి మాట్లాడితే చాలు.. అందరూ పరిగెత్తుతున్నారు. చివరకు తన భర్త మంజునాథ్ కూడా లాస్య పప్పు వండుతానంటే వద్దు.. వద్దు అంటూ బెదిరిపోతాడు.
అయితే.. ఇదంతా వీడియో కోసమే. అవును.. లాస్యకు ఒక యూట్యూబ్ చానెల్ ఉంది కదా. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక పూర్తిగా లాస్య తన యూట్యూబ్ చానెల్ మీదనే దృష్టి పెట్టింది.
తాజాగా పప్పు వండిన వీడియోను యూట్యూబ్ లో షేర్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం.. లాస్య పప్పు వండిన వీడియోను మీరు కూడా చూసేయండి మరి..