Lata Mangeshkar : ఆదివారం ఉదయం దిగ్గజ గాయని లతా మంగేష్కర్ (Lata Mangeshkar) కన్నుమూశారు. 92ఏళ్ల వయసులో తనువు చాలించిన ఆమె పరిస్థితి శనివారం విషమించినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం ఆమెకు వెంటిలేటర్ సపోర్ట్ అందించినప్పటికీ ఫలితం లేకపోయింది.
2019 నవంబర్ నెలలో నిమోనియా జబ్బున పడ్డ లతా మంగేష్కర్ జనవరి నెలలో కరోనా వైరస్ బారిన పడ్డారు. అప్పటి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. దీంతో ఆమెను ఇన్ని రోజుల పాటు వెంటిలేటర్ సపోర్టు పై ఉంచారు. జనవరి 28న ఆమె ఆరోగ్యం కాస్త కుదుటపడిందని వెంటిలేటర్ తీసేశారు. కానీ వారం రోజుల్లోనే ఆమె పరిస్థితి మరోసారి దిగజారింది.