ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రజలు ఎదురు చూస్తున్నది రెండే రెండు విషయాల్లో. మొదటిది, ముఖ్యమైనది కరోనా వ్యాక్సిన్. రెండోది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేది ఎవరు అని!
ఇప్పటికే చాలా సర్వేలు రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్ ముందంజలో ఉన్నట్లు వెల్లడించాయి. ప్రస్తుతం పోలింగ్ కొనసాగి తుది ఫలితం వెలువడాల్సి ఉంది. కరోనా భయంతో అమెరికన్లు ముందస్తు ఓటింగ్కే మొగ్గుచూపిన సంగతి తెలిసిందే. మెయిల్ ఇన్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ల ద్వారా మొత్తం 24 కోట్ల మంది రిజిస్టర్ ఓటర్లలో.. సుమారు 10 కోట్ల మంది ముందస్తుగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సారి ఎన్నికలు ప్రత్యేక పరిస్థితుల మధ్య జరుగుతున్న నేపథ్యంలో ఫలితాల వెల్లడి కొంచెం ఆలస్యం కావొచ్చని నిపుణుల అభిప్రాయం. అయితే, ట్రంప్ గెలవలేని పక్షంలో భారత్కు నష్టమని పలువురు విశ్లేషిస్తున్నారు.
ట్రంప్….. బిడెన్… ఇండియాకు ఏం జరగనుంది?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల గురించి భారత్కు ఆయన వల్ల జరిగిన మంచి , చెడు గురించి అవగాహన ఉన్న వారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, బైడెన్ గురించే ఆసక్తి. విశ్లేషకుల అభిప్రాయాల ప్రకారం బైడెన్ గెలిస్తే చైనాతో మనకు సమస్యలేనని అంటున్నారు. సోషలిస్ట్ భావాలు కలిగిన జో బైడెన్ గెలిస్తే, అతనికి అతని కుమారుడు హంటర్ బైడెన్ కి చైనా తో వ్యాపార లావాదేవీలు ఉన్నై కాబట్టి చైనా వారితో మరిన్ని వాణజ్య సబంధాలు ఏర్పరచుకోటానికి మొగ్గు చూపుతారు. తత్పలితంగా చైనా కి అడ్డూ, అదుపూ ఉండదు అంటూ కొందరు సోషల్ మీడియాలో విశ్లేషిస్తున్నారు.
చైనా, పాక్ … బైడెన్ గెలిస్తే షాక్…
కమ్యూనిస్ట్ చైనా చెప్పు, చేతల్లో నడిచే సోషలిస్ట్ భావాలు కలిగిన జో బైడెన్ గెలిస్తే భారత్కు అంతర్జాతీయంగా గడ్డు కాలం ఎదురవ్వటానికి అవకాశాలు ఎక్కువ అని విశ్లేషకులు పేర్కొన్నారు. చైనా అయినా, చైనా అండతో దువ్వితే పాకిస్థాన్ అయినా అనునిత్యం భారత్తో గొడవలు పెట్టుకోవటం చేస్తాయని అంచనా వేస్తున్నారు. ఇలాంటి కారణాల వల్ల మన ప్రభుత్వాలు అభివృద్ధిపై కాకుండా అంతర్గత గొడవలపై, సరిహద్దు తగాదాలపైనే ఎక్కువ సమయం గడపాల్సి వస్తుంది. మరోవైపు కీలకమై ఐక్యరాజ్య సమితిలో మన భారతదేశానికి శాశ్వత సభ్యత్వం ఇచ్చే విషయంలో చైనా విముఖం గా ఉంది. అమెరికా అండ దొరికితే డ్రాగన్ కంట్రీ భవిష్యత్తులో ఆ మద్దతు ఇవ్వకపోడానికే చాన్స్ ఉంటుందంటున్నారు. ఈ విశ్లేషకుల మాటలు నిజం అవుతాయా? అమెరికాకు రథసారథిగా ఎవరు ఎన్నిక కానున్నారు? అనే ఉత్కంఠకు తెర పడాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?