సుదీర్ఘకాల చర్చకు తెరదించుతూ లేడీ అమితాబ్గా పేరొందిన సినీ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి బీజేపీలో చేరారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రంలో ఆమె కాషాయ కండువా కప్పుకొన్నారు. అయితే, అనంతరం మీడియాతో మాట్లాడుతూ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె కెరరీలోపై కొత్త చర్చ మొదలైంది.
కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కన్నా తాను ముందుగా తెలంగాణ కోసం పోరాడానని… టీఆర్ఎస్ నుంచి ఇద్దరం ఎంపీలుగా గెలిచామన్నారు. నా రాజకీయ జీవితం ప్రారంభం నుంచి తెలంగాణ కోసమే కొట్లాడానని గుర్తుచేసుకున్న ఆమె… తెలంగాణ ఉద్యమం కోసం “తల్లి తెలంగాణ పార్టీ “ని టీఆర్ఎస్లో విలీనం చేశానన్నారు. కానీ, కేసీఆర్ మొదట నా పార్టీని, తర్వాత నన్ను రాజకీయంగా నిర్వీర్యం చేసే కుట్రపన్నారని సంచలన ఆరోపణలు చేశారు. 2013 లో జూలైలో, అదే రాత్రి తనను సస్పెండ్ చేశారని వాపోయారు.
నాపై కుట్ర చేశారు….
కేసీఆర్ ముందు నుంచే తనపై కేసీఆర్ కుట్రపూరితంగా వ్యవహరించారని విజయశాంతి ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ కోసం ఎవరు ఉండకూడదు, ఏ పార్టీ ఉండకూడదన్న దురుద్దేశ్యంతో కేసీఆర్ వ్యవహరించారని ఫైర్ అయ్యారు. అందుకే తల్లి తెలంగాణ పార్టీని విలీనం చేయమని తనపై కేసీఆర్ ఒత్తిడి తెచ్చారని తెలిపారు. తానే పార్టీ నుంచి బయటకు వెళ్లానని ప్రచారం చేశారని… తెలంగాణ ఇస్తే TRS ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని సోనియాకు చెప్పారని గుర్తు చేశారు. కానీ, అప్పుడు కేసీఆర్ “యూటర్న్”తీసుకున్నారని… తెలంగాణ లో కొట్లాడే నేతలు ఉండకూడదన్న యోచనలో కేసీఆర్ అందర్నీ టి.ఆర్.ఎస్ లో చేర్చుకున్నారని మండి పడ్డారు. టీఆర్ఎస్ అవినీతిని బయట పెట్టడమే ఇకపై తన కర్తవ్యం అని ప్రకటించారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేసీఆర్ పతనం ఖాయమని చెప్పారు.
అవినీతి విషయంలో…
తెలంగాణ సాధన కోసం కొట్లాడిన కేసీఆర్.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అవినీతిపరుడుగా మారారని విజయశాంతి విమర్శించారు. కేసీఆర్ ను గద్దె దించుతాం, ఆయన అవినీతిని బయట పెడతామని హెచ్చరించారు. తెలంగాణ లో అత్యధికంగా అవినీతి జరుగుతోందని… రేపు తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో కొద్దిమంది నేతలు కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీయకుండా, ఆయనతో చేతులు కలిపారని ఆరోపించిన ఆమె.. కేసీఆర్ని నిలదీసి.. గద్దె దింపే సత్తా బీజేపీకి మాత్రమే ఉందన్నారు. బీజేపీలో నా పాత్ర ఏమిటన్నది పార్టీయే నిర్ణయిస్తుందన్నారు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడైనా ప్రచారం చేసేందుకు నేను సిద్ధం అని ప్రకటించిన ఆమె విజయ శాంతి ఎక్కడ ఉన్న కీలక పాత్రే పోషిస్తుందని తెలిపారు. కాగా, త్వరలో విజయశాంతికి రాష్ట్ర శాఖలో కీలక పోస్టు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?