రాయలసీమ రాజకీయాల్లో అనంతపురం జిల్లాకు ఓ ప్రత్యేకత ఉన్నట్లే … రాప్తాడు నియోజకవర్గం అంటే కూడా అంతటి స్పెషల్ అటెన్షన్ సహజంగానే పడుతుంది. పరిటాల కుటుంబ సభ్యుల రాజకీయానికి కేరాఫ్ అడ్రస్గా ఉన్న ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది. వైఎస్ఆర్సీపీ గెలుపొందింది.
అనంతరం రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. అయితే, ఈ పరిణామం పరిటాల ఫ్యామిలీని టార్గెట్ చేసినట్లు ఉందని ప్రచారం జరుగుతోంది.
పరిటాల ఇలాకాలో జగన్ ఎంట్రీ
తాజాగా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి మీడియాతో మాట్లాడుతూ, రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరందిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ వివిధ కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. “ఇప్పటికే పేరూరు డ్యాంకు కృష్ణా జలాలను అందించాం. నియోజక వర్గ పరిధిలో కొత్తగా నాలుగు రిజర్వాయర్ల నిర్మాణానికి చేసిన ప్రతిపాదనలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం ఆమోదం తెలిపారు. ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ గ్రామాల్లో నిర్మించ తలపెట్టిన రిజర్వాయర్ పనులకు సీఎం జగన్ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు.“ అని ప్రకటించారు.
టీడీపీ దోచుకుంది…. వైసీపీ సాధించి చూపించింది
‘హంద్రీనీవా’ నుంచి ప్రత్యేక కాలువ ద్వారా పేరూరు డ్యాంకు నీరు తరలించే మార్గంలోనే మరో నాలుగు సాగునీటి రిజర్వాయర్ల నిర్మాణానికి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గతంలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడ్డారని తోపుదుర్తి ఆరోపించారు. “ హంద్రీనీవా నుంచి పేరూరు డ్యామ్కు నీటి తరలింపు కోసం 803 కోట్ల రూపాయలతో టీడీపీ సర్కారు అంచనాలు రూపొందించింది. అదే డబ్బుతో నాలుగు రిజర్వాయర్లు, ప్రత్యేక కాలువ ద్వారా పేరూరు డ్యామ్కు నీరు తరలిస్తాం. తాజా ప్రతిప్రాదనల ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ. 300 కోట్లు ఆదా కానుంద’ని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెలిపారు . కాగా, తోపుదుర్తి దూకుడుతో రాప్తాడును అభివృద్ధి పథంలో నిలపడంపై పరిటాల ఫ్యామిలీ ఇరుక్కుపోయినట్లేనని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
పరిటాల కుటుంబం ఏమంటోందంటే..
ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాప్తాడు మాజీ శాసనసభ్యురాలు పరిటాల సునీత స్పందించారు. రాప్తాడు చరిత్రలో ఎన్నడూ జరగని అభివృద్ధి టిడిపి హయాంలో జరిగిన విషయాన్ని వైసీపీ ఎమ్మెల్యే తోపుదూర్తి ప్రకాష్ రెడ్డి గుర్తుంచుకోవాలి అని పేర్కొన్నారు. “ప్రగతి పథంలో రాప్తాడును టిడిపి అభివృద్ధి చేస్తే పగలతో, కక్షసాధింపు చర్యలతో వైసీపీ నేతలు పాలన సాగిస్తున్నారు. 18 నెలల్లో జరిగిన అభివృద్ధి కన్నా వైసీపీ నేతలు చేసిన విధ్వంసాలే ఎక్కువ. ఐదేళ్ళలో ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద రూ.21 కోట్లు రాప్తాడు నియోజకవర్గంలో అందిస్తే గడిచిన 18 నెలల్లో ఎంతమందికి సాయం చేసింది? “ అని ప్రశ్నించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?